News August 8, 2025

మానవత్వం చాటుకున్న పవన్ కళ్యాణ్

image

AP: పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. తల్లిదండ్రులు లేని 42 మందిని గుర్తించి తన జులై నెల జీతం నుంచి వారికి రూ.5,000 చొప్పున అందించారు. అలాగే వారికి నాణ్యమైన ఆహారం, దుస్తులు, చదువు తదితరాల కోసం కూడా సొంత డబ్బును పవన్ సమకూర్చారు. వీరిని భగవంతుని పిల్లలుగా ఆయన సంబోధించారు. కాగా నియోజకవర్గ MLAగా పవన్ బాధ్యత తీసుకున్నారని జనసేన వెల్లడించింది.

Similar News

News January 20, 2026

చందనోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: మంత్రి డోలా

image

AP: సింహాచలం నరసింహస్వామి చందనోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయులు ఆదేశించారు. APR 20న చందనోత్సవం సందర్భంగా 19వ తేదీ రాత్రి 6గంటల నుంచే సాధారణ దర్శనాలు నిలిపివేస్తామని SM ద్వారా భక్తులకు తెలపాలన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. FEBలో సమావేశానికి యాక్షన్ ప్లాన్‌తో రావాలని కలెక్టర్, ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో పేర్కొన్నారు.

News January 20, 2026

ఫోన్‌పే IPOకు SEBI ఓకే

image

ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే IPOకు SEBI గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నియంత్రణ సంస్థ సూచనలతో అప్‌డేట్ చేసిన DHRPని ఫోన్‌పే త్వరలోనే సబ్మిట్ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ రూపంలో IPOకు వస్తుండటంతో కంపెనీకి పబ్లిక్ ఇష్యూ ద్వారా కొత్తగా నిధులు సమకూరే అవకాశాలు లేవు. ఫ్రెష్ ఇష్యూలు కూడా ఉండవని తెలుస్తోంది. IPO విలువ రూ.12వేల కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుత UPI లావాదేవీల్లో 45% ఫోన్‌పే యాప్‌ ద్వారానే జరుగుతున్నాయి.

News January 20, 2026

వీధికుక్కల కేసు.. మేనకా గాంధీపై సుప్రీం ఫైర్

image

వీధికుక్కల అంశంపై తమ కామెంట్స్‌ను కించపరచడం కోర్టు ధిక్కరణేనని BJP నేత మేనకా గాంధీపై SC మండిపడింది. ‘మీరు మా వ్యాఖ్యలపై మాట్లాడుతున్నారు. మీ క్లయింట్ ఎలాంటి కామెంట్స్ చేశారో అడిగారా? ఆమె బాడీ లాంగ్వేజ్ గమనించారా?’ అని మేనకా తరఫు లాయర్‌ను ప్రశ్నించింది. దీంతో తాను గతంలో కసబ్ తరఫునా వాదించానని ఆయన గుర్తుచేశారు. కానీ కసబ్ కోర్టు ధిక్కరణకు పాల్పడలేదంటూ తదుపరి విచారణను JAN 28కి వాయిదా వేసింది.