News January 31, 2025
ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి పవన్!

ఏపీ Dy.CM పవన్ ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నట్లు సమాచారం. బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల వేళ తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో పవన్ ప్రచారం తమకు కలిసొచ్చినట్లు బీజేపీ భావిస్తోంది. అదే వ్యూహాన్ని ఢిల్లీలోనూ అమలు చేయాలని ఆ పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ తేదీల్లో ప్రచారం చేస్తారనే విషయంపై ప్రకటన వెలువడాల్సి ఉంది.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


