News July 17, 2024
ఎల్లుండి ఢిల్లీకి పవన్ కళ్యాణ్

AP: ఈ నెల 19న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ రోజు అక్కడ జరిగే జలజీవన్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి హోదాలో పవన్ హాజరుకానున్నారు. కాగా తొలిసారి కేంద్ర మంత్రితో సమీక్షకు హాజరుకానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
Similar News
News February 7, 2026
‘వాట్సాప్ మీ సేవ’లో 581 సేవలు

TG: ‘వాట్సాప్ మీ సేవ’లో ఇప్పటివరకు 4.5L మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. వారిలో 3.25L మంది డిజిటల్ సేవలు అందుకున్నారని తెలిపింది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా 8096958096 అనే వాట్సాప్ నంబర్కు HI అని మెసేజ్ చేసి 581 రకాల సేవలు పొందవచ్చని పేర్కొంది. బర్త్, డెత్, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు, లైసెన్సులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితరాలను పొందవచ్చంది.
News February 7, 2026
సాగు భూములకే రైతు భరోసా!

TG: రైతు భరోసా(₹6,000) కేవలం సాగులో ఉన్న భూములకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వానాకాలం సీజన్లో సాగు వివరాల ఆధారంగా అర్హులైన రైతులకే నగదు జమ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అగ్రికల్చర్ వర్సిటీ శాటిలైట్ మ్యాపింగ్ సర్వే పూర్తి చేయగా 1.53 కోట్ల ఎకరాల సాగుభూమిలో 20 లక్షల ఎకరాలు పంట వేయకుండా ఉన్నట్లు తేలింది. కాగా మున్సిపోల్ తర్వాత రైతు భరోసా ఇస్తామని CM ప్రకటించారు.
News February 7, 2026
రేపు సూర్యుడిని ఎందుకు పూజించాలి?

రేపు భాను సప్తమి. దీన్నే ‘ఆరోగ్య సప్తమి’ అని కూడా అంటారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే పవిత్ర నదులలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తొలగిపోయి, శరీరం శుద్ధి అవుతుందని నమ్ముతారు. సూర్యరశ్మిలోని శక్తి మన శారీరక, మానసిక అనారోగ్యాలను నయం చేస్తుంది. నిష్ఠతో ఉపవాసం ఉండి సూర్యుడిని పూజించే వారికి గత జన్మల పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా, ఏడాది పొడవునా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా దైవిక రక్షణ లభిస్తుంది.


