News April 5, 2024
రేపటి నుంచి ప్రజల్లోకి పవన్ కళ్యాణ్

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రేపు నెల్లిమర్ల, ఏప్రిల్ 7న అనకాపల్లి, ఏప్రిల్ 8న ఎలమంచిలి నియోజకవర్గాల్లో జరిగే వారాహి విజయ భేరి యాత్రలో ఆయన పాల్గొననున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. తీవ్ర జ్వరం నుంచి కోలుకోవడంతో ఆయన ప్రచార షెడ్యూల్ను పార్టీ విడుదల చేసింది.
Similar News
News September 14, 2025
టారిఫ్ వార్: ట్రంప్కు చైనా స్ట్రాంగ్ కౌంటర్

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు చైనాపై 50-100% టారిఫ్స్ వేయాలని ట్రంప్ నిన్న NATOకు <<17700504>>లేఖ<<>> రాసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్కు చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘మేం యుద్ధాలను సృష్టించం.. పాల్గొనం. యుద్ధాలతో సమస్యలను పరిష్కరించలేం. ఆంక్షలు వాటిని మరింత క్లిష్టతరం చేస్తాయి’ అని స్పష్టం చేశారు. కాగా చైనా ముందు నుంచి ట్రంప్ చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.
News September 14, 2025
రోజురోజుకూ పడిపోతున్న ఉల్లి ధరలు

AP: కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధరలు పాతాళం వైపు పయనిస్తున్నాయి. రైతుల వద్ద క్వింటాను మార్క్ఫెడ్ రూ.1,200కు కొనుగోలు చేయగా నిల్వలు పెరిగిపోయాయి. కొత్త సరకు వస్తే దించుకోవడానికి స్థలం లేకపోవడంతో తమ వద్ద ఉన్న స్టాకును కొనాలని వ్యాపారులను మార్క్ఫెడ్ కోరింది. తొలుత ఆసక్తి చూపని వ్యాపారులు ఆపై నాణ్యతను బట్టి క్వింటా రూ.50 నుంచి రూ.450 వరకు కొన్నారు. 800 టన్నుల వరకు కొనుగోళ్లు జరిగాయి.
News September 14, 2025
‘వాహనమిత్ర’కు ఎవరు అర్హులంటే?

AP: <<17704079>>వాహనమిత్ర<<>> కింద రూ.15 వేలు పొందాలంటే ఆటో, క్యాబ్ యజమానే డ్రైవర్గా ఉండాలి. గూడ్స్ వాహనాలకు వర్తించదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ఫ్యామిలీలో ఒక్క వాహనానికే పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, IT కట్టేవారు ఉండకూడదు. సిటీల్లో 1000 చ.అ.లకు మించి స్థిరాస్తి ఉన్నవారు అనర్హులు. AP రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్లుండాలి. కరెంట్ బిల్లు నెలకు 300యూనిట్లలోపు రావాలి.