News April 5, 2024

రేపటి నుంచి ప్రజల్లోకి పవన్ కళ్యాణ్

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రేపు నెల్లిమర్ల, ఏప్రిల్ 7న అనకాపల్లి, ఏప్రిల్ 8న ఎలమంచిలి నియోజకవర్గాల్లో జరిగే వారాహి విజయ భేరి యాత్రలో ఆయన పాల్గొననున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. తీవ్ర జ్వరం నుంచి కోలుకోవడంతో ఆయన ప్రచార షెడ్యూల్‌ను పార్టీ విడుదల చేసింది.

Similar News

News November 27, 2025

రోజుకు 10వేల క్యాలరీల ఫుడ్ తిని.. నిద్రలోనే మృతి

image

రష్యాలో షాకింగ్ ఘటన జరిగింది. ఈటింగ్ ఛాలెంజ్ ద్వారా మొదట బరువు పెరిగి తర్వాత తగ్గే ప్రోగ్రామ్‌ను ప్రయత్నిస్తూ ఫిట్‌నెస్ కోచ్ డిమిత్రి నుయాన్జిన్(30) చనిపోయారు. ఆయన రోజుకు 10వేల క్యాలరీలకుపైగా జంక్ ఫుడ్ తిన్నట్లు తెలుస్తోంది. డిమిత్రి ప్రయత్నం వికటించి ఒక నెలలోనే 13KGలు పెరిగి 103KGలకు చేరారు. చివరికి గుండెపోటుతో నిద్రలోనే మరణించారు. ఇలాంటి ఛాలెంజ్‌లను ఎవరూ అనుసరించొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

News November 27, 2025

అమరావతిలో వేంకటేశ్వర ఆలయం రెండేళ్లలో పూర్తి: సీఎం

image

AP: దేవతల రాజధాని అమరావతి అని, మన రాజధానికి అమరావతి పేరు పెట్టే అవకాశం దేవుడు తనకిచ్చారని CM CBN చెప్పారు. కృష్ణా తీరంలో వేంకటేశ్వర ఆలయ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ‘ఈ ప్రాంతాన్ని కాపాడే శక్తి ఈ గుడికి ఉంది. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని TTDని కోరుతున్నా. ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. ఆరోగ్యం, సంపద, ఆనందం ప్రతిఒక్కరికీ ఇవ్వాలని స్వామిని వేడుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

News November 27, 2025

స్మోకింగ్, డ్రింకింగ్ కంటే ఒత్తిడి డేంజర్ అని తెలుసా?

image

స్మోకింగ్, డ్రింకింగ్ కంటే వేగంగా ఆయువును ఒత్తిడి హరిస్తుందని ఓ ఆర్థోపెడిక్ సర్జన్ తెలిపారు. ‘ఒత్తిడి కేవలం మానసిక సమస్య కాదని చాలామందికి తెలియదు. అది పూర్తి బాడీకి సంబంధించినది. ఒత్తిడికి గురైనప్పుడు శరీరం కార్టిసాల్, అడ్రినలిన్ రిలీజ్ చేస్తుంది. వెన్నునొప్పి, తలనొప్పి, పళ్లు కొరకడం, కండరాలు పట్టేయడం వంటి వాటికీ ఒత్తిడే కారణం’ అని చెప్పారు. 7-8 గంటల నిద్రతోనే ఒత్తిడిని ఎదుర్కోగలమన్నారు.