News October 17, 2024
అన్నాడీఏంకేకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
అన్నాడీఎంకే 53వ వార్షికోత్సవం సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ తాను ఆరాధించే గొప్ప నాయకుడని, పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన వారసత్వాన్ని జయలలిత కొనసాగించారని, ఆమె అడుగుజాడల్లో పార్టీ మరింత పుంజుకోవాలని ఆకాంక్షించారు. తమిళ భాష, సంస్కృతి, వారి పోరాట పటిమ పట్ల తనకెంతో గౌరవముందని పేర్కొన్నారు.
Similar News
News October 17, 2024
ఉప్పల్ స్టేడియం కేసులో ఈడీ దూకుడు
TG: ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్మాల్ కేసులో 3కంపెనీలకు ED సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న అజారుద్దీన్ను విచారించిన ED, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బాడీడ్రెంచ్ ఇండియా, సర స్పోర్ట్స్, ఎక్స్లెంట్ ఎంటర్ప్రైజెస్కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని ఆదేశించింది. జనరేటర్స్, జిమ్ పరికరాలు, క్రికెట్ బాల్స్, ఇతర వస్తువుల్లో అక్రమాలు జరిగాయని అజారుద్దీన్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
News October 17, 2024
సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్మీట్
TG: ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు. మూసీ సుందరీకరణ, హైడ్రా, గ్రూప్-1 మెయిన్స్, అప్పులపై ప్రతిపక్షాల విమర్శలపై స్పందించనున్నారు.
News October 17, 2024
బెయిల్ కండీషన్.. ‘భారత్ మాతాకీ జై చెప్పాల్సిందే’
మధ్యప్రదేశ్లో ‘పాకిస్థాన్ జిందాబాద్.. హిందుస్థాన్ ముర్దాబాద్’ నినాదాలు చేసిన నిందితుడు ఫైజల్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు ముగిసే వరకు ప్రతి నెలా మొదటి, చివరి మంగళవారం మిస్రోడ్ పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినదిస్తూ అక్కడి జాతీయ జెండాకు 21సార్లు సెల్యూట్ చేయాలని స్పష్టం చేసింది. స్టేట్ కౌన్సిల్ బెయిల్కు అడ్డుచెప్పగా, న్యాయమూర్తి తోసిపుచ్చారు.