News June 25, 2024
పార్టీ MLAలకు పవన్ కళ్యాణ్ సూచనలు

AP: ప్రజల ఆశలు, ఆకాంక్షలను అసెంబ్లీలో ప్రతిఫలింపచేద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సభా వ్యవహారాలపై పార్టీ MLAలతో ఆయన సమీక్షించారు. ‘సభ రూల్స్పై అవగాహన పెంచుకోవాలి. శాఖాపరమైన అంశాలు, ప్రజా సమస్యలను అధ్యయనం చేసి చర్చల్లో పాల్గొనాలి. గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఉక్కుపాదం మోపుదాం. ప్రజలు, అధికారులతో వాడే భాష మర్యాదపూర్వకంగా, సరళంగా, గౌరవంగా ఉండాలి. పరుష పదజాలం వద్దు’ అని సూచించారు.
Similar News
News November 24, 2025
ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

TG: హైదరాబాద్ శామీర్పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.
News November 24, 2025
భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.
News November 24, 2025
118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

<


