News August 8, 2024

కర్ణాటక సీఎంతో పవన్ భేటీ

image

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరులో భేటీ అయ్యారు. వీరిద్దరూ పలు విషయాలపై చర్చించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు ఊళ్లలోకి వచ్చి పంటలు నాశనం చేస్తున్నట్లు పవన్ దృష్టికి వచ్చింది. వీటిని అడవుల్లోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరం. అవి కర్ణాటకలో ఉండటంతో కొన్నింటిని ఏపీకి తరలించాలని కోరేందుకు పవన్ బెంగళూరుకు వెళ్లారు.

Similar News

News December 1, 2025

25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ షురూ

image

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 25,487 కానిస్టేబుల్(GD)ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులను జనవరి 8, 9, 10 తేదీల్లో కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, అస్సాం రైఫిల్స్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
వెబ్‌సైట్: <>https://ssc.gov.in/<<>>

News December 1, 2025

కోలుకున్న గిల్, హార్దిక్.. సౌతాఫ్రికాతో టీ20లు ఆడే ఛాన్స్!

image

గాయాల కారణంగా కొన్ని రోజులుగా క్రికెట్‌కు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్ హార్దిక్ కోలుకున్నట్లు సమాచారం. హార్దిక్ T20లలో ఆడేందుకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ క్లియరెన్స్ ఇచ్చినట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. గిల్‌కు కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. దీంతో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో వీరు ఆడే ఛాన్స్ ఉంది. వీరి రాకతో టీమ్ ఇండియా బలం పెరగనుంది.

News December 1, 2025

TGకి ఐదేళ్లలో రూ.3.76Lకోట్ల నిధులిచ్చాం: కేంద్రం

image

తెలంగాణకు గత ఐదేళ్లలో రూ.3,76,175 కోట్ల నిధులు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. BJP MP అరవింద్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్లు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా వివిధ పద్ధతుల్లో నిధులు విడుదల చేశామన్నారు. ఐదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రాబడి కింద రూ.4,35,919Cr వచ్చాయని తెలిపారు.