News November 27, 2024

కేంద్ర మంత్రితో పవన్ భేటీ.. ఎర్రచందనంపై చర్చ

image

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయ్యారు. ఎర్రచందనం పరిరక్షణపై చర్చించారు. ఏపీ, తమిళనాడులో ఎర్ర చందనం పెరుగుదల, స్వాధీనం చేసుకున్న కలపను ఈ-వేలం వేయడానికి రాష్ట్ర అటవీ శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించడం, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన కలపను రాష్ట్రానికి తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు.

Similar News

News December 10, 2025

APPLY NOW:TIFRలో ఉద్యోగాలు..

image

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 3వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tifr.res.in

News December 10, 2025

మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ

image

ఉక్రెయిన్‌లో మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. అయితే యుద్ధ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలంటే మిత్రదేశాల నుంచి భద్రత, సహకారం అవసరమని చెప్పారు. మరోవైపు ప్రతిపక్షం కూడా ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అభిప్రాయపడుతోంది.

News December 10, 2025

దేశంలో పెరిగిన అమ్మాయిల సగటు వివాహ వయస్సు

image

దేశంలో బాలికల సగటు వివాహ వయస్సు 22.9 సంవత్సరాలకు చేరుకుందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో అమ్మాయిల సగటు వివాహ వయస్సు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో బాలికల వివాహ వయస్సు సగటున 22.1 సంవత్సరాలుగా ఉంది. ఇది 2020లో 22.7కి పెరిగింది. 2021లో ఇది 22.5 కాగా, 2022లో ఇది 22.7కి చేరుకుంది.