News June 4, 2024
విజయవాడ చేరుకున్న పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు బయల్దేరారు. కౌంటింగ్ సరళిపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించే ఛాన్సుంది. అనంతరం ఇవాళ రాత్రికి టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని భేటీ కానున్నారు.
Similar News
News September 9, 2025
భరించలేకపోతున్నా.. నాకింత విషం ఇవ్వండి: దర్శన్

కొన్ని రోజులుగా జైలులో సూర్యరశ్మి తాకట్లేదని కన్నడ హీరో దర్శన్ కోర్టుకు తెలిపారు. తాను ఫంగస్తో బాధపడుతున్నానని, తన దుస్తులు స్మెల్ వస్తున్నాయని వాపోయారు. బయటకు వెళ్లేందుకు అనుమతివ్వాలని లేదా విషం ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణను సెషన్స్ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. బయట ఉంటే కేసును ప్రభావితం చేస్తారని గత నెలలో <<17401764>>దర్శన్<<>> బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
News September 9, 2025
రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: అనంతపురం పట్టణంలో రేపు ‘సూపర్ 6-సూపర్ హిట్’ విజయోత్సవ సభ నేపథ్యంలో అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఈ సభకు CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానుండటంతో రద్దీ దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చినట్లు తెలిపారు. రేపు హాలిడే ఇస్తున్న కారణంగా రెండో శనివారమైన ఈ నెల 13న పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పని చేస్తాయన్నారు.
News September 9, 2025
హిమాలయ జ్వాలకు 3 కారణాలు.. 3 రూపాలు!

1.హిమాలయ దేశం నేపాల్లో నెలకొన్న అవినీతి, దానికి పరిష్కారం లేకపోవడంపై ఆ దేశ Zen Z(యువత) ‘అసహనం’తో ఉంది. 2.కొందరు నేతలు కుటుంబాలతో విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడిపే వీడియోలు ఇటీవల వైరలవగా ప్రజా ధనంతో పాలకుల జల్సాలా? అనే ‘ఆవేదన’ వ్యక్తమైంది. 3.దేశంలో రిజిస్టర్ కాలేదని SM సైట్లను ప్రభుత్వం నిషేధించింది. దీంతో తమ గొంతును పాలకులు అణిచివేశారనే ‘ఆగ్రహం’తో నిరసన జ్వాల నియంత్రణ తప్పి కార్చిచ్చులా దహిస్తోంది.