News December 28, 2024
నేడు కడపకు పవన్.. ఎంపీడీవోకు పరామర్శ

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న అన్నమయ్య(D) గాలివీడు MPDO జవహర్ బాబును పరామర్శిస్తారు. అనంతరం గాలివీడులోని ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శిస్తారు. దాడి జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకుంటారు. కాగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


