News March 29, 2024

రేపే పిఠాపురానికి పవన్

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురానికి 3రోజుల పర్యటనకు రానున్నారు. ఆయన అక్కడి నుంచే బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. పట్టణానికి చేరుకోగానే తొలుత శక్తిపీఠాన్ని సందర్శించి, పాదగయ క్షేత్రంలో పూజలు చేస్తారని జనసేన వర్గాలు తెలిపాయి. వారాహి వాహనానికి కూడా ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం ప్రచారం మొదలుపెడతారని పేర్కొన్నాయి. అక్కడి పర్యటన నుంచి పవన్ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు వెల్లడించాయి.

Similar News

News January 2, 2026

IPL: గ్రీన్ కంటే పతిరణకే ఎక్కువ డబ్బులు

image

IPL మినీ ఆక్షన్‌లో గ్రీన్ (₹25.20Cr), పతిరణ (₹18Cr) అత్యధిక ధర పలికిన టాప్-2 ఆటగాళ్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే గ్రీన్ కంటే పతిరణకే ఎక్కువ డబ్బులు రానున్నాయి. ఓవర్సీస్ ప్లేయర్ల ఫీజు విషయంలో <<18572248>>BCCI పెట్టిన లిమిట్<<>> వల్ల గ్రీన్‌కు ₹18Cr మాత్రమే దక్కుతాయి. అందులో IND+AUS ట్యాక్సులు పోగా ఆయనకు మిగిలేది ₹9.9కోట్లే. అటు SL బౌలర్ పతిరణకు ట్యాక్సులు తీసేయగా ₹12.9 కోట్లు మిగులుతాయి.

News January 2, 2026

శబరిమల బంగారం చోరీ.. CBI దర్యాప్తు అవసరం లేదు: కేరళ CM

image

శబరిమల బంగారం చోరీ కేసులో CBI దర్యాప్తు డిమాండ్లను కేరళ CM విజయన్ తోసిపుచ్చారు. SIT దర్యాప్తు సంతృప్తికరంగా జరుగుతోందన్నారు. సాక్ష్యాల ఆధారంగా ఎవరినైనా విచారణకు పిలవచ్చన్నారు. ఈ కేసులో అరెస్టై జైలులో ఉన్న ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, మరో జ్యువెలర్, కాంగ్రెస్ ఎంపీలు అదూర్ ప్రకాశ్, ఆంటోని కట్టుదిట్టమైన భద్రతలో ఉండే కాంగ్రెస్ అగ్రనేత సోనియాతో సన్నిహితంగా ఉండటంపై అనుమానం వ్యక్తం చేశారు.

News January 1, 2026

విషపు నీళ్లు!

image

దాహం తీర్చాల్సిన నీళ్లే విషమై ప్రాణం తీసిన <<18729199>>ఘటన<<>> యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. MP ఇండోర్‌లో నీళ్లు కలుషితమై 6 నెలల పసికందు సహా 10 మంది మరణించడం వెనుక యంత్రాంగం నిర్లక్ష్యం కళ్లకు కడుతోంది. తాగునీటి పైప్‌లైన్‌లో మురికినీరు ఎక్కడ కలుస్తుందో మున్సిపల్ అధికారులు ఇప్పటికీ కనుక్కోలేకపోవడం వారి చేతగానితనానికి నిదర్శనం. 10 రోజులైనా బాధిత ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించలేని దౌర్భాగ్యం.