News November 4, 2024
రేపు సరస్వతి పవర్ భూములను పరిశీలించనున్న పవన్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు పల్నాడులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మాచవరం మండలంలోని సరస్వతి పవర్ భూములు పరిశీలించనున్నట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. సరస్వతి శక్తికి సంబంధించిన భూ ఉల్లంఘనలను తనిఖీ చేస్తానని పవన్ కళ్యాణ్ సైతం వెల్లడించారు. కాగా సరస్వతి భూముల విషయంలో వైసీపీ అధినేత జగన్, షర్మిల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News November 4, 2025
ఇక ఎందులో ప్రయాణించాలి?

ఇటీవల పలు బస్సు ప్రమాదాలు ప్రజల్లో భయాన్ని నింపాయి. స్లీపర్ బస్సుల వైపు అయితే కొంతకాలం చూడకూడదనే పరిస్థితి తెచ్చాయి. బస్సులెందుకు ట్రైన్లలో వెళ్దామనుకుంటే ఇవాళ ఛత్తీస్గఢ్ రైలు ప్రమాదం డైలమాలోకి నెట్టింది. ఇక ఎందులో ప్రయాణించాలి? అనే చర్చ ఏ ఇద్దరు కలిసినా విన్పిస్తోంది. అయితే వాహనం ఏదైనా యాక్సిడెంట్లు జరగొచ్చని, వాటి నియంత్రణకు ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
News November 4, 2025
WWC టీమ్ను ప్రకటించిన ఐసీసీ.. కెప్టెన్ ఎవరంటే?

మహిళల ప్రపంచ కప్-2025 టీమ్ ఆఫ్ ది టోర్నీని ICC ప్రకటించింది. విజేతగా నిలిచిన భారత్ నుంచి ముగ్గురికి చోటు దక్కింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు చొప్పున, పాక్, ఇంగ్లండ్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. టీమ్: స్మృతి మంధాన, లారా(కెప్టెన్), జెమీమా, కాప్, గార్డ్నర్, దీప్తి శర్మ, సదర్లాండ్, డి క్లెర్క్, నవాజ్, అలానా కింగ్, ఎక్లిస్టోన్, బ్రంట్ (12వ ప్లేయర్). మీకు నచ్చిన ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి.
News November 4, 2025
DEC లేదా JANలో భోగాపురం నుంచి టెస్ట్ ఫ్లైట్: రామ్మోహన్

AP: భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు 91.7% పూర్తైనట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. ‘గడువుకు ముందే పనులను పూర్తి చేయాలని నిశ్చయంతో ఉన్నాం. DEC ఆఖరు లేదా JAN తొలి వారంలో టెస్ట్ ఫ్లైట్ ఎగరనుంది. ఏవియేషన్ వర్సిటీ, ఇండిగో హబ్ ఏర్పాటుకు యత్నిస్తున్నాం. భోగాపురంలో స్కిల్ వర్సిటీలు నిర్మిస్తాం’ అని తెలిపారు. అంతకుముందు విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు జీఎంఆర్ ప్రతినిధులు పనుల పురోగతిని వివరించారు.


