News October 21, 2024

డయేరియా బాధితులను పరామర్శించనున్న పవన్

image

AP: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు డయేరియా బాధితులను పరామర్శించనున్నారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ కలుషిత నీటి వల్ల వాంతులు, విరేచనాలతో నాలుగు రోజుల వ్యవధిలోనే ఏడుగురు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే ఆయన బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అక్కడి పరిస్థితులపై సమీక్షిస్తారు.

Similar News

News October 21, 2024

SSC కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్

image

TG: SSC జీడీ కానిస్టేబుల్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ కోచింగ్ ఇస్తున్నట్లు టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నేటి నుంచి జనవరి 31 వరకు టీ-శాట్ నెట్‌వర్క్ ఛానళ్ల ద్వారా క్లాసులు నిర్వహిస్తామన్నారు. ఇటు 1,388 గ్రూప్-3 పోస్టులకు సంబంధించి కంటెంట్‌ను మరో రెండు గంటలు అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 16 వరకు రోజూ 4గంటలు ప్రసారం చేస్తామన్నారు.

News October 21, 2024

అందుకే హిందీలో మాట్లాడను: సమంత

image

పలకడంలో తప్పులు దొర్లుతాయనే భయంతోనే స్టేజీపైన హిందీలో మాట్లాడనని హీరోయిన్ సమంత అన్నారు. ‘సిటాడెల్’లో హనీ(సమంత)కి హిందీ బాగా వచ్చని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ విషయాన్ని దర్శకులు గుర్తించలేకపోయారని అన్నారు. ఫ్యామిలీ మ్యాన్-2 సమయంలో సమంత హిందీ మాట్లాడకపోవడం చూసి సిటాడెల్‌లో వేరే హీరోయిన్‌ని తీసుకోవాలని భావించినట్లు దర్శకులు రాజ్ అండ్ డీకే చెప్పారు. ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపారు.

News October 21, 2024

రాష్ట్రాభివృద్ధికి శాంతిభద్రతలు ముఖ్యం: CM రేవంత్

image

TG: ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యమని, పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని సీఎం రేవంత్ అన్నారు. గోషామహల్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు.