News September 22, 2025
ఆ వేడుకకు పవన్ అన్నను ఆహ్వానించా: లోకేశ్

AP: కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే ఇచ్చిన మాట నిలుపుకుందని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘Dy.CM పవన్ అన్నను మర్యాదపూర్వకంగా కలిశాను. ఈనెల 25న MEGA DSC విజేతలకు నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమానికి హాజరవ్వాలని ఆహ్వానించాను. గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోగా DSCని అడ్డుకోవాలని 87 కేసులు వేశారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ టీచర్ల కలలు సాకారం చేశామని వివరించా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 22, 2025
TGPSCకి ముగ్గురు కొత్త సభ్యులు

TGPSCకి కొత్తగా ముగ్గురు సభ్యులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రకాంత్ రెడ్డి, విశ్వప్రసాద్ (IPS), ప్రొఫెసర్ L.B.లక్ష్మీకాంత్ రాథోడ్లను సభ్యులుగా నియమించింది. వీరు ఆరేళ్ల పాటు లేదా వారికి 62 ఏళ్లు వచ్చేంత వరకు పదవుల్లో కొనసాగుతారని పేర్కొంది.
News September 22, 2025
అక్టోబర్ 3న క్యాబినెట్ సమావేశం

AP: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అక్టోబర్ 3న జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని శాఖలకు నోట్ పంపారు. అక్టోబర్ 1న 4PM లోపు ప్రతిపాదనలు పంపించాలని పేర్కొన్నారు. కాగా 2న దసరా, 4(శని), 5(ఆది) తేదీల్లో స్టేట్ ఆఫీసులకు హాలిడే ఉంది. OCT 3న లీవ్ పెట్టుకుంటే పండుగకు వరుసగా 4 రోజులు కలిసి వస్తాయని, సొంతూళ్లకు వెళ్లొచ్చని సచివాలయ ఉద్యోగులు భావించారు. ఈ భేటీ ప్రకటనతో ఉసూరుమన్నారు.
News September 22, 2025
రెండు రోజుల క్రితం లేఖ.. ఇవాళ హతం

ఆయుధాలు వదిలే ప్రసక్తే లేదంటూ ప్రకటించిన రెండు రోజులకే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా <<17796054>>రామచంద్రారెడ్డి<<>> ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఆయుధాలు వదిలేస్తామంటూ అభయ్ పేరుతో ఇటీవల లేఖలు కలకలం రేపాయి. ఆ ప్రకటన పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ ఈ నెల 20న లేఖ విడుదల చేశారు. అది తాజాగా బయటకు రావడం, ఆయన మరణించడం చర్చనీయాంశమైంది.