News April 8, 2025

పవన్ కుమారుడికి ప్రమాదం.. స్పందించిన YS జగన్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ <<16028483>>అగ్నిప్రమాదంలో <<>>గాయపడిన ఘటనపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడ్డాడని తెలిసి షాకయ్యా. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని జగన్ Xలో రాసుకొచ్చారు.

Similar News

News December 7, 2025

జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్

image

TG: ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు’ వేడుకల్లో భాగంగా ఎల్లుండి ఉ.10 గంటలకు జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని కలెక్టర్లను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గత ఏడాది డిసెంబర్ 9న సచివాలయంలో విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి జరిగే గ్లోబల్ సమ్మిట్‌‌లోనూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

News December 7, 2025

వేసవిలో స్పీడ్‌గా, చలికాలంలో స్లోగా కదులుతున్న హిమానీనదాలు

image

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమానీనదాలు వేసవిలో వేగంగా, శీతాకాలంలో నెమ్మదిగా కదులుతున్నట్లు నాసా గుర్తించింది. దశాబ్దం పాటు సేకరించిన శాటిలైట్ డేటా ఆధారంగా 36 మిలియన్లకుపైగా ఫొటోలను పరిశీలించి జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు స్టడీ చేశారు. 5 sq.km కంటే పెద్దవైన హిమానీనదాల ఫొటోలను పోల్చి కాలానుగుణంగా వాటి కదలికలను గుర్తించారు. ఫ్యూచర్‌లో హిమానీనదాల కరుగుదల అంచనాలో కదలికలు కీలకం కానున్నాయి.

News December 7, 2025

ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు

image

ఇంటర్నెట్ లేకుండానే UPI చెల్లింపులకు నేషనల్ పేమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఫీచర్‌ను ఏర్పాటు చేసింది. USSD ఆధారిత ఫీచర్ ద్వారా నెట్ లేకున్నా, మారుమూల ప్రాంతాల నుంచి చెల్లింపులు చేయొచ్చు. అయితే ముందుగా బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌తో ‘*99#’కి డయల్ చేసి ఆఫ్‌లైన్ UPIని పొందాలి. ఆపై USSD ఫీచర్‌తో చెల్లింపులు చేయాలి. దేశంలో 83 BANKS, 4 టెలి ప్రొవైడర్ల నుంచి ఈ అవకాశం అందుబాటులో ఉంది.