News May 4, 2024

పవార్ కుమార్తె వర్సెస్ పవార్ భార్య

image

మహారాష్ట్రలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే NCP తమదంటే తమదంటూ శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య పోరు జరుగుతోంది. ఇదిలా ఉంటే బారామతిలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీ చేస్తుండగా.. ఆమెపై అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్‌ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. 2009 నుంచి ఇక్కడ సుప్రియా సూలే గెలుస్తూ వస్తున్నారు. అయితే NCP అజిత్ వర్గానికి చిక్కడంతో ఆమె ఈసారి కొత్త గుర్తుతో పోటీ చేయాల్సి వస్తోంది.

Similar News

News November 18, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,740 తగ్గి రూ.1,23,660కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,600 పతనమై రూ.1,13,350 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,70,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 18, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,740 తగ్గి రూ.1,23,660కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,600 పతనమై రూ.1,13,350 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,70,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 18, 2025

కొండెక్కిన ‘కోడిగుడ్డు’

image

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలతో పాటు కోడి గుడ్ల రేట్లు కూడా కొండెక్కుతున్నాయి. కార్తీక మాసం, అయ్యప్ప దీక్షల సమయంలో వినియోగం తగ్గినా రేటు పైపైకి వెళ్తోంది. జూన్‌లో ఫారం వద్ద ఒక్కో ఎగ్ ధర ₹4.60 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో ₹5.50 పలికింది. ఇప్పుడు ఫారంలో ₹6కు, రిటైల్‌లో ₹7కు చేరింది. పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చు పెరగడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.