News May 4, 2024
పవార్ కుమార్తె వర్సెస్ పవార్ భార్య

మహారాష్ట్రలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే NCP తమదంటే తమదంటూ శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య పోరు జరుగుతోంది. ఇదిలా ఉంటే బారామతిలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీ చేస్తుండగా.. ఆమెపై అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. 2009 నుంచి ఇక్కడ సుప్రియా సూలే గెలుస్తూ వస్తున్నారు. అయితే NCP అజిత్ వర్గానికి చిక్కడంతో ఆమె ఈసారి కొత్త గుర్తుతో పోటీ చేయాల్సి వస్తోంది.
Similar News
News March 18, 2026
జూన్లో గ్రూప్స్ నోటిఫికేషన్?

AP: గ్రూప్-1,2 పోస్టుల భర్తీకి APPSC సిద్ధమవుతోంది. జూన్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన డేటా ప్రకారం గ్రూప్-1లో 101 పోస్టులు, గ్రూప్-2లో 470 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఆగస్టులో, గ్రూప్-2కు సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
News March 18, 2026
ప్రతీకారం తీర్చుకోవాల్సిందే: మొజ్తబా

అమెరికాతో సీజ్ఫైర్ ప్రతిపాదనను ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ తిరస్కరించారు. US, ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన చెప్పినట్లు ఇరాన్ అధికారి ద్వారా తెలిసిందని రాయిటర్స్ వెల్లడించింది. ‘శాంతికి ఇది సమయం కాదు. US, ఇజ్రాయెల్ మోకరిల్లి, ఓటమిని అంగీకరించి, నష్టపరిహారం చెల్లించాలి’ అని మొజ్తబా స్పష్టంచేశారని పేర్కొంది. USతో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని 2 దేశాలు ఇరాన్కు ప్రతిపాదనలు పంపాయంది.
News March 18, 2026
సన్రైజర్స్ వివాదం ముందే ఊహించాం: పీసీబీ వర్గాలు

The Hundred లీగ్లో పాకిస్థాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ను సన్ రైజర్స్ కొనుగోలు చేయడంపై <<19368622>>తీవ్ర దుమారం<<>> రేగడం తెలిసిందే. అయితే దీన్ని ముందే ఊహించామని పీసీబీ వర్గాలు చెప్పాయి. ‘అబ్రార్ను సన్రైజర్స్ లీడ్స్ తీసుకోవడంపై జరుగుతున్న రచ్చ మేం ఊహించనిదేమీ కాదు. అతడేమీ పెద్దగా టెన్షన్ పడటం లేదు. ఇది ECB, ఫ్రాంచైజీకి సంబంధించిన విషయం’ అని తెలిపినట్లు టెలికం ఆసియా స్పోర్ట్స్ వెల్లడించింది.


