News March 20, 2025
ఉద్యోగులకు రేపు రూ.6,200 కోట్ల బకాయిల చెల్లింపు

AP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రేపు వారికి రూ.6,200 కోట్ల CPS, GPF, APGAI బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 11న దాదాపు రూ.1,033 కోట్ల బకాయిలను చెల్లించిన విషయం తెలిసిందే.
Similar News
News November 13, 2025
ముంబైలోకి విధ్వంసకర బ్యాటర్

IPL: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ రూథర్ఫర్డ్ను జట్టులోకి తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. రూ.2.6 కోట్లకు గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది. ఇతడికి 200 టీ20 మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. 3500కు పైగా రన్స్ చేశారు. భారీ సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగల సత్తా రూథర్ఫర్డ్ సొంతం.
News November 13, 2025
అల్ ఫలాహ్ వర్సిటీకి షాక్

ఉగ్ర మూలాలు బయటపడిన ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ వర్సిటీపై అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్(AIU) చర్యలు తీసుకుంది. సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వెంటనే లోగోను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కళాశాలకు గుర్తింపు ఉందంటూ వెబ్సైట్లో ప్రదర్శించినందుకు వర్సిటీకి న్యాక్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీకి ఫండింగ్, డాక్టర్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయనుంది.
News November 13, 2025
ప్రేమ అర్థాన్ని కోల్పోయింది: అజయ్ దేవగణ్

ప్రేమ అర్థాన్ని కోల్పోయిందని బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ అన్నారు. ‘ప్రేమ అనే పదాన్ని అనవసరంగా ఉపయోగిస్తున్నారు. దాని డెప్త్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రతి మెసేజ్కు హార్ట్ ఎమోజీ పెడుతున్నారు. అన్ని మెసేజ్లు లవ్తో ముగుస్తున్నాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పెళ్లికి ఎక్స్పైరీ డేట్, రెన్యువల్ ఉండాలని అజయ్ భార్య <<18269284>>కాజోల్<<>> చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఇలా చెప్పడం గమనార్హం.


