News April 9, 2024
పేటీఎం పేమెంట్స్ సీఈఓ రాజీనామా

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈఓ సురీందర్ చావ్లా తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం దాఖలు చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్లో ఈ విషయాన్ని సంస్థ తెలిపింది. ‘వ్యక్తిగత కారణాలతో ఈ నెల 8న చావ్లా తన రాజీనామాను సమర్పించారు. ఈ ఏడాది జూన్ 26 నుంచి ఆయన పదవి నుంచి అధికారికంగా తప్పుకొంటారు’ అని స్పష్టం చేసింది. గత ఏడాది జనవరిలో చావ్లా పేటీఎంలో చేరారు.
Similar News
News December 4, 2025
భూసేకరణకు పీసా కమిటీ ఆమోదం తీసుకోవాలి: కలెక్టర్

ఏలూరు జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు చేసే భూసేకరణకు సంబంధిత గ్రామాలలో పీసా కమిటీ సమావేశాలు నిర్వహించి ఆమోదం తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి పోలవరం ప్రాజెక్టు, ఆర్అండ్ఆర్ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణానికి, సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్ల ఏర్పాటు నిమిత్తం భూసేకరణపై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.
News December 4, 2025
రైతన్నా.. పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు

పంటకాలం పూర్తయ్యాక చాలా మంది రైతులు ఆ వ్యర్థాలను తగలబెడుతుంటారు. వీటిని తొలగించడానికి అయ్యే ఖర్చును భరించలేక ఇలా చేస్తుంటారు. అయితే దీని వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పంటకు మేలు చేసే కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు, నులిపురుగులు నాశనమవుతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గుతుంది. ఈ వ్యర్థాలను పంటకు మేలు చేసే ఎరువులుగా మార్చే సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 4, 2025
పాక్ దివాలా.. అమ్మకానికి జాతీయ ఎయిర్లైన్స్

IMF ప్యాకేజీ కోసం తమ జాతీయ ఎయిర్లైన్స్ను అమ్మడానికి పాకిస్థాన్ సిద్ధమైంది. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(PIA) బిడ్డింగ్ ఈ నెల 23న జరుగుతుందని ఆ దేశ ప్రధాని షరీఫ్ ఓ ప్రకటనలో చెప్పారు. ‘PIAలో 51-100% విక్రయించడం అనేది IMF $7 బిలియన్ల ఆర్థిక ప్యాకేజీ కోసం నిర్దేశించిన షరతులలో భాగం. ఈ సేల్కు ఆర్మీ నియంత్రణలోని ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ కూడా ముందస్తు అర్హత సాధించింది’ అని అక్కడి మీడియా చెప్పింది.


