News March 20, 2025

IPL ట్రోఫీ కోసం PBKS ప్రత్యేక పూజలు!

image

మరో రెండ్రోజుల్లో IPL మొదలు కానుండటంతో అన్ని జట్లు సమరానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. అయితే పంజాబ్ కింగ్స్ జట్టు ఈసారి కప్ తమకే రావాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించింది. టీమ్ కోచ్ రికీ పాంటింగ్, కోచింగ్ సిబ్బంది, ప్లేయర్లంతా కలిసి పూజలో పాల్గొన్నారు. 2008 నుంచి ఆడుతున్నప్పటికీ పంజాబ్ ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేదు. మరి పూజతోనైనా జట్టు తలరాత మారుతుందో చూడాలి.

Similar News

News November 19, 2025

NRPT: 3వ జిల్లా మహా సభలు విజయవంతం చేయాలి

image

జిల్లా కేంద్రంలో జరిగే PDSU జిల్లా మహా సభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ అన్నారు. మహా సభల వాల్ పోస్టర్లను బుధవారం నారాయణపేట పట్టణంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 22, 23 రెండు రోజులు మహా సభలు జరుగుతాయని, విద్యార్థులు, విద్యావంతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. నేతలు పాల్గొన్నారు.

News November 19, 2025

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్

image

భారత సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 513 పాయింట్లు పెరిగి 85,186.47(0.61%) వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 26,052.65(0.55%) వద్ద క్లోజ్ అయ్యింది. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.34% పెరగ్గా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.39% పడిపోయింది. ఓవరాల్‌గా BSE లిస్టెడ్ కంపెనీలు రూ.474.6 లక్షల కోట్ల నుంచి రూ.475.6 లక్షల కోట్లకు చేరాయి. అంటే సింగిల్ సెషన్‌లోనే రూ.లక్ష కోట్లకు పైగా లబ్ధి పొందాయి.

News November 19, 2025

BREAKING: ఖాతాల్లో రూ.7,000 జమ

image

AP: పీఎం కిసాన్ డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. ప్రధాని మోదీ TNలోని కోయంబత్తూరులో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. దీంతో దేశంలో అర్హులైన రైతుల అకౌంట్లలో రూ.2వేల చొప్పున జమయ్యాయి. అటు కడప జిల్లా పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు బటన్ నొక్కి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను రిలీజ్ చేశారు. దీంతో రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లో యాడ్ అయ్యాయి. మొత్తంగా రూ.7 వేల చొప్పున జమయ్యాయి.