News December 20, 2024

పీసీ యాక్ట్ వర్తించదు.. HCలో కేటీఆర్ న్యాయవాది వాదనలు

image

TG: ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. KTRపై పెట్టిన పీసీ యాక్ట్ వర్తించదని, ఆయన లబ్ధి పొందినట్లు FIRలో లేదని కేటీఆర్ తరఫు న్యాయవాది సుందరం వాదించారు. రాజకీయ కక్షలో భాగంగానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.

Similar News

News November 28, 2025

‘అమరావతిలో పరిష్కారమైన లంక భూముల సమస్య’

image

రాజధాని ల్యాండ్ పూలింగ్‌కు  లంక భూమలు ఇచ్చిన రైతుల సమస్య పరిష్కారం అయిందని మంత్రి నారాయణ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతుల ప్లాట్‌లకు  రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందని, లంక భూములిచ్చిన రైతులు తమ రిటర్నబుల్ ప్లాట్‌లను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వెల్లడించారు. ఆయా గ్రామాలకు సంబంధించిన యూనిట్ ఆఫీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌకర్యం కల్పించామన్నారు.

News November 28, 2025

అమ్మకానికి రెండు IPL జట్లు: హర్ష్ గోయెంకా

image

ఒకటి కాదు రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా పేర్కొన్నారు. ‘ఆర్సీబీ మాత్రమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా అమ్మకానికి వస్తుందని నేను విన్నాను. వీటిని కొనుగోలు చేసేందుకు నలుగురు.. ఐదుగురు బయ్యర్స్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పుణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, USA ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి’ అని ట్వీట్ చేశారు.

News November 28, 2025

స్మృతితో పెళ్లిపై పలాశ్ తల్లి ఏమన్నారంటే..

image

స్మృతి మంధాన వివాహంపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పలాశ్ ముచ్చల్ తల్లి అమృత స్పందించారు. త్వరలోనే పెళ్లి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఆ రోజు జరిగిన పరిణామాలపై ఇద్దరూ బాధపడుతున్నారు. మ్యారేజ్ అవగానే స్మృతికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేశాం. అనుకోని పరిస్థితులతో వివాహం వాయిదా వేశాం’ అని చెప్పారు. కాగా పెళ్లి సంబంధిత పోస్టులను స్మృతి డిలీట్ చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.