News December 22, 2024

FEB 28 వరకు పీసీ ఘోష్ కమిషన్ గడువు

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణకు నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం నాలుగోసారి పొడిగించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు అవకాశమిచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లలో సమస్యలు బయటపడిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Similar News

News November 18, 2025

దోషులు పాతాళంలో ఉన్నా వదలం: అమిత్ షా

image

ఢిల్లీ బ్లాస్ట్ దోషులు పాతాళంలో ఉన్నా వదలబోమని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వారిని చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని మూలాల నుంచి నిర్మూలించడం మనందరి బాధ్యతని అన్నారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో జరిగిన 32వ నార్తర్న్ జోనల్ కౌన్సిల్ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని సృష్టిస్తాయని, ఈ విషయంలో జోనల్ కౌన్సిల్స్ పాత్ర కీలకమని అన్నారు.

News November 18, 2025

దోషులు పాతాళంలో ఉన్నా వదలం: అమిత్ షా

image

ఢిల్లీ బ్లాస్ట్ దోషులు పాతాళంలో ఉన్నా వదలబోమని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వారిని చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని మూలాల నుంచి నిర్మూలించడం మనందరి బాధ్యతని అన్నారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో జరిగిన 32వ నార్తర్న్ జోనల్ కౌన్సిల్ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని సృష్టిస్తాయని, ఈ విషయంలో జోనల్ కౌన్సిల్స్ పాత్ర కీలకమని అన్నారు.

News November 18, 2025

జనవరిలోనే WPL షురూ.. డేట్స్ ఇవేనా?

image

వచ్చే ఏడాది జనవరి 7 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3న ఫైనల్ జరిగే అవకాశం ఉందని Cricbuzz తెలిపింది. WPL-2026 కోసం నవీ ముంబై, వడోదర స్టేడియాలను ఎంపిక చేయొచ్చని తెలిపింది. ఫిబ్రవరిలో జరిగే T20 పురుషుల ప్రపంచకప్‌ను భారత్ కో-హోస్ట్ చేస్తుండటంతో WPLను ముందుగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 26న వేదికలు, తేదీలు ఖరారు కానున్నాయి. 27న మెగా వేలం జరగనుంది.