News December 22, 2024
FEB 28 వరకు పీసీ ఘోష్ కమిషన్ గడువు

TG: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణకు నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం నాలుగోసారి పొడిగించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు అవకాశమిచ్చింది. గత ఏడాది అక్టోబర్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లలో సమస్యలు బయటపడిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
Similar News
News October 23, 2025
అకాలపు వాన.. అరికల కూడు

ఇప్పుడు మనకు సాధారణంగా కనిపించే వరి అన్నం ఒకప్పుడు చాలా అరుదు. కేవలం ధనికుల ఇళ్లలోనే వండుకునేవారు. సామాన్యులు ఎక్కువగా అరికల అన్నం తినేవారు. కొత్తగా వరి పండించే రోజుల్లో ‘అకాలపు వాన.. అరికల కూడు’ అనే సామెత ప్రాబల్యంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. వాన అదును తప్పి కురిస్తే ధనవంతులు కూడా అరికల కూడు తినాల్సిందేనన్నది దీని అర్థం.
☛ మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి
News October 23, 2025
నలభై ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే వ్యాధులివే..

40 ఏళ్ల తర్వాత మహిళల్లో అనేక వ్యాధులొచ్చే ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పని ఒత్తిడి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పలు శారీరక, మానసిక వ్యాధులొస్తాయంటున్నారు. ముఖ్యంగా బోలుఎముకలవ్యాధి, గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్, మానసిక ఒత్తిడి దాడి చేస్తాయంటున్నారు. శరీరంలో హార్మోన్ల మార్పులే వీటికి కారణమంటున్నారు. కాబట్టి మహిళలు 40 తర్వాత తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
News October 23, 2025
పూర్తి బకాయిలు చెల్లించేవరకు ఆందోళనలు: నెట్వర్క్ ఆసుపత్రులు

AP: ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి రూ.250 కోట్లు <<18076438>>రిలీజ్<<>> చేసినా నెట్వర్క్ ఆసుపత్రులు వెనక్కి తగ్గలేదు. తాము డిమాండ్ చేస్తున్న రూ.2,700 కోట్ల పూర్తి బకాయిలను చెల్లించాలని ఆసుపత్రుల అసోసియేషన్ కోరింది. పూర్తి బకాయిలు చెల్లించేవరకు ఆందోళన కొనసాగుతుందని ప్రకటించింది. ప్రభుత్వం విడుదల చేసిన వాటితో సరిపెట్టుకోలేమని స్పష్టం చేసింది. దీంతో ఇవాళ ‘చలో విజయవాడ మహాధర్నా’ యథాతథంగా ఉంటుందని పేర్కొంది.