News March 2, 2025

బాబర్, రిజ్వాన్‌కు పీసీబీ ఝలక్?

image

పాకిస్థాన్ స్టార్ ప్లేయర్స్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌కు PCB ఝలక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో T20 సిరీస్‌కు వీరిద్దరిని పక్కనబెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీరి స్థానంలో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 16 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జరగబోయే T20 WC కోసం ఇప్పటినుంచే కుర్రాళ్లను ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు టాక్.

Similar News

News December 29, 2025

పశుసంవర్ధక రంగంతో ఆర్థిక పురోగతి: కలెక్టర్

image

పశుసంవర్ధక రంగాన్ని మరింత బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను స్థిరపరచవచ్చని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం పార్వతీపురం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు సంబంధిత శాఖలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు సమాచారాన్ని వేగంగా చేరవేయడానికి AI వంటి ఆధునిక కృత్రిమ మేథస్సును వినియోగించాలని సూచించారు.

News December 29, 2025

ఒక్క కాఫీతో కపుల్స్ గొడవలకు ఫుల్‌స్టాప్!

image

దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. గిల్లికజ్జాలు లేకపోతే ఆ సంసారంలో మజా ఉండదు అంటారు. అయితే ఒక్కోసారి మాటామాటా పెరిగి ఈగోకి పోతుంటారు. అది అస్సలు మంచిది కాదని ఫ్యామిలీ కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు. ‘ఎలాంటి గొడవైనా మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సాయంత్రం ఒక మంచి కాఫీ పెట్టుకుని ఇద్దరూ కూర్చొని మనసు విప్పి మాట్లాడుకుంటే ఏ గొడవైనా ఇట్టే సాల్వ్ అవుతుంది’ అని సూచిస్తున్నారు.

News December 29, 2025

ALERT: పెరగనున్న కార్ల ధరలు!

image

కొత్త ఏడాదిలో కారు కొనాలనుకునే వారికి వాహన తయారీ సంస్థలు షాకిచ్చాయి. ముడిసరుకుల ధరలు, నిర్వహణ వ్యయం పెరగడంతో జనవరి తొలివారంలో కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. సుజుకీ, హ్యుందాయ్, MG, టాటా, మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్ వంటి సంస్థలు మోడల్‌ను బట్టి 1% నుంచి 3% వరకు ధరలను పెంచే అవకాశం ఉంది. అయితే ఇయర్ ఎండ్ సేల్స్‌లో భాగంగా ఈ సంస్థలు భారీ డిస్కౌంట్స్‌తో అమ్మకాలు జరుపుతున్న విషయం తెలిసిందే.