News March 13, 2025

ఒక్కో మ్యాచ్‌కు రూ.3,110 ఫీజు: ఆటగాళ్లకు PCB షాక్

image

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించి తీవ్ర నష్టాల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టీ20 కప్‌లో పాల్గొనే దేశవాళీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను భారీగా కుదించింది. గతంలో ఒక్కో మ్యాచ్‌కు 40 వేల పాకిస్థానీ రూపాయలు (భారత కరెన్సీలో రూ.12 వేలు) ఇచ్చేది. ఇప్పుడు దానిని 10 వేలకు (భారత కరెన్సీలో రూ.3,110) తగ్గించింది. అలాగే చీప్ హోటళ్లలో బస, విమాన ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించింది.

Similar News

News January 5, 2026

శివ మానస పూజలో చదవాల్సిన మంత్రాలు

image

‘శివ మానస పూజ స్తోత్రం’ దీనికి ప్రధాన మంత్రం. ఇది ‘రత్నైః కల్పితమాసనం’ అని మొదలవుతుంది. ఈ స్తోత్రం చదవడం వీలుకాకపోతే కేవలం ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపిస్తూ పూజ చేయవచ్చు. లేదా ‘శివోహం శివోహం’ అని స్మరించవచ్చు. చివరగా ‘ఆత్మా త్వం గిరిజా మతిః’ అనే శ్లోకాన్ని పఠించినా విశేష ఫలితాలుంటాయి. ఈ పూజలో మన ప్రతి కర్మను శివుడికి అర్పించాలి. శివ మానస పూజను ఎవరైనా, ఎప్పుడైనా ఆచరించవచ్చు.

News January 5, 2026

వరి నాట్లు.. ఇలా చేస్తే అధిక ప్రయోజనం

image

వరి రకాల పంట కాలాన్ని బట్టి 22-28 రోజుల వయసుగల నారును నాట్లు వేసుకోవాలి. వరి నారు కొనలను తుంచి నాటితే కాండం తొలుచు పురుగు, ఇతర పురుగుల గుడ్లను నాశనం చేయవచ్చు. నాట్లు పైపైనే 3సెంటీమీటర్ల లోతులోనే నాటితే పిలకలు ఎక్కువగా వస్తాయి. నాటేటప్పుడు పొలంలో ప్రతి 2 మీటర్ల దూరానికి 20 సెం.మీ కాలిబాటలు వదలాలి. కాలిబాటలు తూర్పు పడమర దిశగా ఉంచాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు బాగా అంది చీడల సమస్య తగ్గుతుంది.

News January 5, 2026

బ్యాలెట్ పేపర్‌తోనే మున్సిపల్ ఎలక్షన్స్

image

TG: మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్‌తోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. అంతకుముందు 2014లో EVMలు, 2020లో కరోనా కారణంగా బ్యాలెట్‌తో నిర్వహించారు. ఈసారి EVMలతో నిర్వహించే అవకాశమున్నా బ్యాలెట్ వైపే మొగ్గుచూపారు. మరో వారం, 10 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఈ నెల 10న తుది ఓటర్ల జాబితా రానుంది.