News December 11, 2024
బియ్యం అక్రమాలపై అవసరమైతే పీడీ యాక్టు: CBN

AP: బియ్యం స్మగ్లింగ్ వంటి అక్రమ చర్యలను నియంత్రించేందుకు అవసరమైతే పీడీ యాక్టును వాడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ బాధ్యత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపై ఉందని పేర్కొన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు సొమ్మును 24 గంటల్లోపే రైతులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పీడీఎస్ రైస్ తినని వారికి ప్రత్యామ్నాయం చూసేందుకు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 28, 2025
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసా?

అండాశయం (ఓవరీస్) నుంచి అండం గర్భసంచిలోకి వచ్చేలా తోడ్పడే ట్యూబ్స్ను ‘ఫెలోపియన్ ట్యూబ్స్’ అంటారు. కొన్ని సందర్భాల్లో పిండం గర్భసంచిలో బదులు ఈ ఫెలోపియన్ ట్యూబుల్లో పెరగడంతోపాటు ఒక్కోసారి అండాశయాల్లో (ఓవరీస్), కాస్తంత కిందికి వస్తే గర్భాశయ ముఖద్వారంలో, ఒక్కోసారి కడుపులో కూడా పెరగవచ్చు. ఈ సమస్యనే ‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’గా వ్యవహరిస్తారు. దీనివల్ల కొన్నిసార్లు తల్లికి ప్రాణాపాయం సంభవిస్తుంది.
News November 28, 2025
నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

నేషనల్ హౌసింగ్ బ్యాంక్(<
News November 28, 2025
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లక్షణాలు

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో మొదట్లో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. కొందరిలో పీరియడ్స్ ఆగిపోవడం, వికారం ఉంటాయి. ఇంట్లో చేసుకునే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఫలితాలు ‘పాజిటివ్’ అని వస్తాయి. రక్తస్రావం కావడం, పొత్తికడుపులో నొప్పి రావడం ద్వారా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా అనుమానించాలి. ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉన్నవాళ్లలో, లైంగిక సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకిన మహిళల్లో ఈ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశముంటుంది.


