News March 27, 2025
PDPL: ఈసారైనా మంత్రి పదవి దక్కేనా!

పెద్దపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు మంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు. దీంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాదిలోపు మంత్రివర్గ విస్తరణ చేయనుండడంతో CM రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న MLA విజయ రమణారావు మంత్రి పదవి దక్కేనా అని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది.
Similar News
News December 22, 2025
కర్నూలు: 633 మందికి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం

శిక్షణే ఒక పోలీసు భవిష్యత్కు పునాదని క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజాసేవే నిజమైన పోలీసు శక్తి” అని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం అన్నారు. కర్నూల్ APSP రెండవ బెటాలియన్ శిక్షణా కేంద్రం, DTC కర్నూలులో 633 మంది స్టైపిండరీ కానిస్టేబుళ్లకు 9నెలల ప్రాథమిక శిక్షణ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. శిక్షణా కాలంలో ప్రతి రిక్రూట్ బాధ్యతాయుతమైన, ప్రజాభిముఖ పోలీసుగా తీర్చిదిద్దబడతారని తెలిపారు.
News December 22, 2025
MNCL: లోక్ అదాలత్లో 4411 కేసులు పరిష్కారం

21న జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్లో రామగుండం కమిషనరేట్ పరిధిలో మొత్తం 4411 కేసులు పరిష్కరించామని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. 59 సైబర్ క్రైమ్ కేసులలో బాధితులకు రూ.53,24,105 తిరిగి అందజేసినట్లు పేర్కొన్నారు. టార్గెట్కు మించి కేసులు పరిష్కరించబడడం పట్ల కమిషనరేట్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. త్వరలో కోర్టు సిబ్బందికి, మానిటర్ చేసిన అధికారులకు, త్వరలో రివార్డ్స్ అందజేస్తామన్నారు.
News December 22, 2025
ప.గో జిల్లాలో యూరియా కొరత లేదు: జేసీ

జిల్లాలో యూరియా కొరత లేదని రబీ సీజన్కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి భీమవరంలో తెలిపారు. జిల్లాలో రబీ పంటకు, అన్ని పంటలకు అవసరమైన 36,820 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువుల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది అన్నారు. అక్టోబర్ 1 నాటికి 7,009 మెట్రిక్ టన్నుల యూరియా ప్రారంభ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.


