News April 2, 2025
PDPL: కస్టమర్లకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

పెద్దపల్లి కలెక్టరేట్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈశ్వర ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద వివిధ యూనిట్ల స్థాపనకు సహకారం చుట్టామన్నారు.
Similar News
News October 16, 2025
సిరిసిల్ల విద్యార్థి సంతోష్కు రాష్ట్రస్థాయి పోటీల్లో అవకాశం

సిరిసిల్ల విద్యార్థి సంతోష్కు రాష్ట్రస్థాయి పోటీల్లో అవకాశం లభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి 69వ ఎస్జిఎఫ్ (SGF) కబడ్డీ క్రీడా పోటీల్లో కుసుమ రామయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి జే.సంతోష్ ప్రతిభ కనబర్చి ఎంపికయ్యాడు. ఈ పోటీలు వచ్చే నెల భద్రాద్రి కొత్తగూడెంలో జరగనున్నాయని గురువారం పాఠశాల హెడ్ మాస్టర్ లకావత్ మోతిలాల్ తెలిపారు. ఉపాధ్యాయులు సంతోష్ను సన్మానించి అభినందించారు.
News October 16, 2025
జగిత్యాల: ‘పెన్షనర్ల బకాయిల కోసం రాజీలేని పోరాటం’

పెన్షనర్ల బకాయిల చెల్లింపుల కోసం TGE JAC ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం కొనసాగుతుందని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన TPCA సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు. కార్యక్రమంలో హన్మంత్ రెడ్డి, గౌరీశెట్టి విశ్వనాథం, ప్రకాష్ రావు, యాకూబ్, గంగాధర్, వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.
News October 16, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. 4వ రోజు 19 మంది నామినేషన్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గురువారం కొత్తగా 19 మంది క్యాండిడేట్లు 21 నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.