News April 2, 2025

PDPL: కస్టమర్లకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

image

పెద్దపల్లి కలెక్టరేట్‌లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈశ్వర ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద వివిధ యూనిట్ల స్థాపనకు సహకారం చుట్టామన్నారు.

Similar News

News November 24, 2025

పిల్లలకి ఘనాహారం ఎలా అలవాటు చెయ్యాలంటే?

image

చిన్నారులకు 6నెలలు దాటిన తర్వాత కాంప్లిమెంటరీ ఫీడింగ్‌ రాగి మాల్ట్, ఉగ్గు వంటివి స్టార్ట్ చెయ్యాలి. నెమ్మదిగా బ్రకోలీ, చిక్కుళ్లు, బీన్స్, బీరకాయ, క్యారెట్, బీట్‌రూట్ ఆవిరిపై ఉడికించి వారికి తినిపించాలి. అప్పుడే వారి శరీరం భిన్నరకాల ఆహారాలకు అలవాటవుతుంది. పోషకాలూ అందుతాయి. చాలామంది పేరెంట్స్ ఇడ్లీ, రసం, పెరుగన్నం త్వరగా తింటున్నారని అవే పెడతారు. దీంతో ఎదుగుదలలో ఇబ్బందులు వస్తాయంటున్నారు నిపుణులు.

News November 24, 2025

కీలక తీర్పుల్లో సూర్యకాంత్‌ ముద్ర

image

53వ CJIగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ సూర్యకాంత్‌ అనేక కీలక తీర్పుల్లో భాగస్వామ్యం అయ్యారు. జమ్మూకశ్మీర్‌ ఆర్టికల్‌ 370 రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం వంటి ప్రధాన అంశాలపై ఆయన సభ్యుడిగా ఉన్న ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులు విశేషంగా నిలిచాయి. దేశద్రోహ చట్టాన్ని నిలిపివేసిన ధర్మాసనంలో కూడా సభ్యుడు. ఈ చట్టం కింద కొత్త FIRలు నమోదు చేయొద్దని ఆదేశించారు.

News November 24, 2025

సంగారెడ్డి: భారీగా గంజాయి పట్టివేత

image

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. 42 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, గంజాయి రవాణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.