News February 5, 2025

PDPL: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. రేపటి నుంచి ట్రైనింగ్

image

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రేవంత్ సర్కార్ మరో ముందడుగు వేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు బుధవారం నుంచి హైదరాబాద్లో శిక్షణ మొదలుపెట్టనుంది. వీరి శిక్షణ పూర్తి అయ్యాక టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వసున్నారు. ఈ నెల 15లోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తోందని సమాచారం. ఈ నెల చివరి వారం లేదా మార్చి మొదటివారంలో ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 17, 2025

సూర్యాపేట: @11AM.. పోలింగ్ శాతం ఎంతంటే?

image

సూర్యాపేట జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 11 వరకు నమోదైన పోలింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు.
చింతలపాలెం – 64.93%
గరిడేపల్లి – 62.10%
హుజూర్నగర్ – 53.57%
మట్టంపల్లి – 65.93%
మేళ్లచెర్వు – 56.42%
నేరేడుచర్ల – 50.53%
పాలకవీడు – 61.69%
జిల్లాలోపోలింగ్ సరాసరి 60.13% నమోదైనట్లు వివరించారు.

News December 17, 2025

విశాఖ: హోంగార్డు టు సివిల్ పోలీస్‌

image

లక్ష్యాన్ని సాధించాలనే దృక్పథం ఉండాలే తప్ప ఏదైనా సాధించవచ్చు అని విశాఖకి చెందిన హోంగార్డు నిరూపించాడు. బాలాజీ 40 ఏళ్ల వయసులో హోంగార్డుగా ఐటీ కోర్‌లో పని చేస్తూ రాత్రింబవళ్ళు కష్టపడి సిటీ సివిల్ పోలీస్‌గా ఎంపికయ్యాడు. యువతతో అన్ని విభాగాల్లోనూ పోటీపడుతూ ఉత్తమప్రతిభ చూపిస్తూ 6 నిమిషాల్లో 1,600 మీటర్లు పరిగెత్తి శభాష్ అనిపించుకున్నాడు. మంగళగిరిలో నిన్న నియామక పత్రం అందుకున్నాడు.

News December 17, 2025

విమర్శలకు భయపడేది లేదు: చంద్రబాబు

image

AP: మెడికల్ కాలేజీల అంశంపై విమర్శలకు భయపడేది లేదని కలెక్టర్ల సదస్సులో CM CBN తెలిపారు. PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయన్నారు. 70% మందికి NTR వైద్యసేవలు అందడంతో పాటు విద్యార్థులకు సీట్లూ పెరుగుతాయని చెప్పారు. గతంలో రూ.500Crతో రుషికొండ ప్యాలెస్‌ను నిర్మించి డబ్బులు వృథా చేశారని, అవి ఉంటే 2 మెడికల్ కాలేజీలు నిర్మించేవాళ్లమని CM వ్యాఖ్యానించారు.