News March 16, 2025
PDPL: డ్రగ్స్ నష్టాలపై విస్తృత ప్రచారం కల్పించాలి: అదనపు కలెక్టర్

పెద్దపల్లి అదనపు కలెక్టర్ డి.వేణు కలెక్టరేట్లో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టే చర్యలపై సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్రతిశాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించుకుని అమలు చేయాలని ఆయన సూచించారు.
Similar News
News April 22, 2025
జన సమీకరణలో బిజీ.. బిజీ

27న వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి ఖమ్మం నుంచి 50 నుంచి 60 వేల మందిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. MP రవిచంద్ర, MLC తాతా మధుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జులగా ఉన్నారు. జనసమీకరణలో వారు బీజీ అయ్యారు. MLC కవిత నేతలతో సమామేశమై సభకు జనాన్ని భారీగా తరలించాలని దిశ నిర్దేశం చేశారు. అధికార పార్టీ బలాన్ని అధిగమించి వీరు ఎంతవరకు జన సమీకరణ చేస్తారనేది ఆసక్తి నెలకొంది.
News April 22, 2025
పాలమూరు: భూభారతి చట్టంలో కొన్ని వివరాలు..

✓ఇష్టారీతిగా భూ రికార్డుల్లో మార్పులు చేయడం, మోసపూరితంగా భూమి హక్కులు, పట్టాలను పొందితే వాటిని వెంటనే రద్దు చేస్తారు. ✓అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూములను ఎవరైనా పట్టాలుగా పొందితే ఆ భూములన్నీ రద్దవుతాయి.✓భూములు అన్యాక్రాంతం అయినట్టుగా అనుమానాలున్నా ప్రజలు నేరుగా సీసీఎల్ఏకు ఫిర్యాదు చేయవచ్చు.✓దరఖాస్తుల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే కూడా అప్పీల్కు వెళ్లేందుకు అవకాశం ఉంది.
News April 22, 2025
వనపర్తి: ఓపెన్ టెన్త్ పరీక్షలకు 42 మంది గైర్హాజరు

వనపర్తి బాలికల ఉన్నత పాఠశాలలో ఓపెన్ టెన్త్ పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కాగా 26వరకు జరగనున్నాయని అధికారులు చెబుతున్నారు. సోమవారం 349మంది విద్యార్థులు SSC పరీక్షలు రాయాల్సి ఉండగా 307మంది విద్యార్థులు రాశారని, 42మంది గైర్హాజరు అయ్యారని ఓపెన్ SSC, INTER స్కూల్స్ జిల్లా కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఓపెన్ ఇంటర్ పరీక్ష 491మంది రాయల్సి ఉండగా 435 మంది రాశారని, 56 మంది గైర్హాజరయ్యారన్నారు.