News April 4, 2025
PDPL: ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు: కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంథని మండలం దుబ్బపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 173లో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి చేయాలని చూస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News April 19, 2025
ఈనెల 24తో ముగియనున్న AU EET దరఖాస్తు గడువు

సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే AU EET-2025 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ఈనెల 24తో ముగియనుంది. ప్రవేశ పరీక్షను మే 5వ తేదీన నిర్వహిస్తారు. ఇంటర్ విద్యార్హత కలిగిన విద్యార్థులు సత్వరం దరఖాస్తు చేసుకోండి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. పూర్తి వివరాలకు ఏయూ వెబ్సైట్ నుంచి పొందవచ్చు.
News April 19, 2025
నేటి నుంచి 10 రోజులు..

తెలంగాణలో రాబోయే పది రోజులు ఎండలు మండిపోతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 30 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదు అవుతాయని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో 40-42 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో అకాల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
News April 19, 2025
కోడూరు: తాబేలు పిల్లలను విడిచిపెట్టిన జాయింట్ కలెక్టర్

అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లలను కృష్ణాజిల్లా కలెక్టర్ గీతాంజలి శర్మ సాగరంలోకి వదిలిపెట్టారు. శనివారం కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ కుటుంబ సమేతంగా హంసలదీవి శివారు పాలకాయతిప్ప బీచ్ వద్ద అటవీ శాఖ వారి సంరక్షణలో ఉన్న గుడ్ల సేకరణ,సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. కృత్రిమంగా విధానంలో పొడిగించిన తాబేళ్ల పిల్లలను గీతాంజలి శర్మ సముద్రంలోకి విడిచిపెట్టారు.