News January 23, 2025
PDPL: ఫిబ్రవరి 1లోగా గురుకుల ప్రవేశాల దరఖాస్తు సమర్పించాలి: RDO

గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య పేర్కొన్నారు. గురువారం గురుకుల అధికారులతో RDO సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్లను తహశీల్దారులు వెంటనే జారీ చేయాలని ఆదేశించారు. మరిన్ని వివరాలకు హెల్ప్ డెస్క్ నంబర్ 18005985459 ను సంప్రదించాలని పేర్కొన్నారు.
Similar News
News February 8, 2025
సమంతతో విడాకులు.. ఆ విషయంలో బాధపడ్డా: నాగచైతన్య

సమంతతో తాను విడాకులు తీసుకోవడానికి శోభిత ధూళిపాళ్ల కారణమని జరిగిన ప్రచారంపై నాగచైతన్య స్పందించారు. ‘ఇది చూసి నేను చాలా బాధపడ్డా. ఆమెకు ఈ చెడ్డపేరు రావాల్సింది కాదు. విడాకులకు శోభిత కారణమే కాదు. ఆమె నా జీవితంలోకి ఇన్స్టా చాట్లా చాలా సాధారణంగా, అందంగా వచ్చింది. మా మధ్య తొలుత స్నేహం, ఆ తర్వాత రిలేషన్షిప్ మొదలైంది’ అని స్పష్టం చేశారు. కాగా 2021లో సమంతతో విడిపోయిన చైతూ 2024లో శోభితను వివాహమాడారు.
News February 8, 2025
కరుణ్ నాయర్ మరో సెంచరీ

డొమెస్టిక్ క్రికెట్లో విదర్భ ప్లేయర్ <<15137627>>కరుణ్ నాయర్<<>> వీరవిహారం చేస్తున్నారు. రంజీ క్వార్టర్ ఫైనల్-2లో భాగంగా తమిళనాడుతో మ్యాచులో ఆయన మరో సెంచరీ బాదారు. 180 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నారు. కాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ కరుణ్ 5 సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. దీంతో ఆయన టీమ్ ఇండియాకు సెలక్ట్ అవుతారని అందరూ భావించారు. కానీ ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్కు BCCI ఎంపిక చేయలేదు.
News February 8, 2025
ప్రాంతీయ పార్టీలకు గడ్డుకాలం.. నెక్స్ట్ టార్గెట్ బెంగాలేనా?

దేశంలో ప్రాంతీయ పార్టీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఏపీలో వైసీపీ, తెలంగాణలో BRS, ఒడిశాలో బిజూ జనతాదళ్, MHలో శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు అధికారాన్ని కోల్పోయాయి. ఏపీలో టీడీపీ, బిహార్లో JDU ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నాయి. ప.బెంగాల్లో మమతా బెనర్జీ, TNలో స్టాలిన్ బలంగా నిలబడ్డారు. మోదీ నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మీ కామెంట్?