News March 10, 2025

PDPL: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రుణ రాయితీ: ఎ.కీర్తి కాంత్

image

రుణ రాయితీతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని పెద్దపల్లి జిల్లా పరిశ్రమల అధికారి ఎ.కీర్తి కాంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆహార శుద్ధి సంస్థ ఆదేశాలకు ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ స్కీం లో భాగంగా 35 శాతం రుణ రాయితీ రుణాల మంజూరు కోసం మార్చి12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News December 7, 2025

KMR: గుర్తులొచ్చేశాయ్.. ఇక ప్రచారమే లక్ష్యం!

image

కామారెడ్డి జిల్లాలో 2వ విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పర్వం శనివారంతో ముగిసింది. పలు మండలాల్లో పోటీ నుంచి పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితా ఖరారైంది. పోటీలో ఉన్న అభ్యర్థులకు అధికారులు గుర్తులను కేటాయించారు. దీంతో ఎన్నికల వేడి జిల్లాలో మరింత రాజుకుంది. అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచార రంగంలోకి దిగారు.

News December 7, 2025

ఆ మాట అనకుండా ఉండాల్సింది: SA కోచ్

image

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత ఆ టీమ్ హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ వాడిన గ్రోవెల్(సాష్టాంగం పడటం) పదంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్‌లో ఓటమి తర్వాత ఆ కాంట్రవర్సీపై ఆయన స్పందించారు. ‘తప్పుడు ఉద్దేశంతో ఆ మాట అనలేదు. ఇంకా బెటర్ వర్డ్ ఎంచుకుని ఉండాల్సింది. భారత్ మైదానంలో ఎక్కువసేపు గడిపి ఉండాల్సింది అన్న ఉద్దేశంలో అలా అన్నాను. వినయమే SA టెస్టు టీమ్ పునాది’ అని తెలిపారు.

News December 7, 2025

కొత్తగూడెం: వామ్మో.. రూ.12.35 లక్షల కరెంటు బిల్లు హా

image

ప్రతినెల వేలల్లో వచ్చే కరెంటు బిల్లు ఒక్కసారిగా రూ.12,35,191 రావడంతో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్‌కు చెందిన షాపు నిర్వాహకుడు అశోక్‌ ఆందోళనకు గురయ్యారు. గత నెలలో రూ.40,063 ఉన్న బిల్లు ఈ నెలలో లక్షల్లో చేరడాన్ని చూసి అవాక్కయ్యారు. అధికారుల తప్పిదం వల్లే ఇలా జరిగిందని, సరిచేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.