News March 18, 2025

PDPL: భారీ వాహనాల స్పీడ్.. గాలిలో కలుస్తున్న ప్రాణాలు

image

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మట్టి, బూడిద రవాణా చేసే భారీ వాహనాలతో విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. గత వారం రోజుల పరిధిలో అంతర్గాం సమీపంలో కుమార్ అనే యువకుడిని మట్టి టిప్పర్ ఢీకొని మరణించారు. నిన్న మల్యాలపల్లి సబ్ స్టేషన్ సమీపంలో బండి ప్రసాద్ గౌడ్ అనే సింగరేణి కార్మికుడు బూడిద టిప్పర్ ఢీకొని మరణించాడు. డ్రైవర్ల అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు భాస్తున్నారు.

Similar News

News December 13, 2025

NGKL: పోలింగ్‌తో పాటు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలి: కలెక్టర్

image

జిల్లాలో రెండో విడత జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌తో పాటు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించి మధ్యాహ్నం ఒంటిగంటకు నిలిపివేయాలని, భోజన విరామం అనంతరం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. 151 గ్రామపంచాయతీలకు గాను 147 గ్రామాలలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

News December 13, 2025

NGKL: 147 గ్రామాలలో 473 మంది సర్పంచ్ అభ్యర్థులు

image

జిల్లాలో ఈనెల 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 147 గ్రామ పంచాయతీల్లో 473 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 151 గ్రామాలకు గాను 4 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. 1412 వార్డులకు గాను 143 వార్డులు ఏకగ్రీవం కాగా 1269 వార్డులలో 3228 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలోని బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేరు, తిమ్మాజీపేటలలో ఎన్నికలు జరగనున్నాయి.

News December 13, 2025

నేడు కాణిపాకంలో నెల్లూరు కార్పొరేటర్ల ప్రమాణం.?

image

నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ఘట్టం <<18549066>>వైకుంఠపాళి<<>>ని తలపిస్తోంది. అవిశ్వాసాన్ని నెగ్గించాలని TDP, అడ్డుకోవాలని YCP పావులు కదుపుతున్నాయి. పలువురు కార్పొరేటర్లు ‘<<18540168>>జంపింగ్ జపాంగ్<<>>’లా మారారు. ఎలాగైనా తమ కార్పొరేటర్లను కాపాడుకోవాలని TDP వారిని తిరుపతి తరలించిందట. మరికాసేపట్లో వారిని కాణిపాకం తరలించి ‘మేము TDPలోనే కొనసాగుతాం’ అని ప్రమాణం చేయించనున్నారట.