News March 18, 2025

PDPL: భారీ వాహనాల స్పీడ్.. గాలిలో కలుస్తున్న ప్రాణాలు

image

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మట్టి, బూడిద రవాణా చేసే భారీ వాహనాలతో విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. గత వారం రోజుల పరిధిలో అంతర్గాం సమీపంలో కుమార్ అనే యువకుడిని మట్టి టిప్పర్ ఢీకొని మరణించారు. నిన్న మల్యాలపల్లి సబ్ స్టేషన్ సమీపంలో బండి ప్రసాద్ గౌడ్ అనే సింగరేణి కార్మికుడు బూడిద టిప్పర్ ఢీకొని మరణించాడు. డ్రైవర్ల అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు భాస్తున్నారు.

Similar News

News December 5, 2025

ఏలూరు మెడికల్ కాలేజీలో సద్దుమణిగిన వివాదం

image

ఏలూరు మెడికల్ కాలేజీలో జూనియర్లు, సీనియర్ల మధ్య తలెత్తిన వివాదం సమసిపోయింది. సీనియర్లు తమపై దాడి చేశారంటూ జూనియర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏలూరు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ గురువారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం జూనియర్లు సీనియర్‌లపై పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. వివాదాలకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని సీఐ వారికి సూచించారు.

News December 5, 2025

పాక్ తొలి CDFగా ఆసిమ్ మునీర్ నియామకం

image

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్‌గా ఉన్న ఆసిమ్ మునీర్‌ను ఆ దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF)గా నియమిస్తూ అధ్యక్ష కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఆర్మీ స్టాఫ్ చీఫ్ పదవితో పాటు CDFగానూ ఐదేళ్ల పాటు కొనసాగుతారని చెప్పింది. అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. వీరిద్దరికి అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ శుభాకాంక్షలు తెలిపినట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.

News December 5, 2025

అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ 8కి వాయిదా

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కల్తీకి ఉపయోగించిన కెమికల్స్‌లను సరఫరా చేసిన ఏ19 అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. అతనికి బెయిల్ ఇస్తే దర్యాప్తు సరిగ్గా సాగదని ప్రాసిక్యూటర్ వాదించారు. దీంతో బెయిల్ పిటిషన్ 8వ తేదీకి నెల్లూరు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.