News April 16, 2025

PDPL: ‘రేషన్‌లో ప్లాస్టిక్ బియ్యం సరఫరా అనే ప్రచారం అవాస్తవం’

image

రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సన్నబియ్యంలో ప్లాస్టిక్ బిల్డింగ్ ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అదనపు కలెక్టర్ డి.వేణు తెలిపారు. సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆందోళనకు గురిచేసి, సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతో కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే ఐటీయాక్ట్ సెక్షన్ 67 డి, BNS సెక్షన్ 353, 352 కేసులు నమోదు చేస్తామన్నారు.

Similar News

News September 18, 2025

బతుకమ్మ, దసరా పండుగకు 7,754 ప్రత్యేక బస్సులు

image

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా TGSRTC 7,754 ప్రత్యేక బస్సులను సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 2 వరకు నడపనుంది. అందులో 377 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించింది. MGBS, JBS, CBSతో పాటు KPHB, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ తదితర ప్రాంతాల నుంచి బస్సులు నడుస్తాయి. అక్టోబర్‌ 5, 6 తేదీల్లో తిరుగు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కూడా బస్సులను TGSRTC ఏర్పాటు చేయనుంది.

News September 18, 2025

సంతబొమ్మాళి: మూలపేట పోర్టులో కార్మికుడు మృతి

image

సంతబొమ్మాళి (M)మూలపేట పోర్టులో పనిచేస్తున్న కార్మికుడు పింగ్వా(36) గురువారం మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం..జార్ఖండ్‌కు చెందిన పింగ్వా రెండు వారాల కిందట మూలపేట పోర్ట్‌లో కూలీగా పని చేసుందుకు వచ్చాడని, గత మూడు రోజులగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడని చెప్పారు. దీనిపై ఎస్సై నారాయణాస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News September 18, 2025

KNR: ‘పని ప్రదేశాల్లో ఫిర్యాదుల కమిటీ తప్పనిసరి’

image

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టంపై జెడ్పీ సమావేశ మందిరంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ సభ్యులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కంపెనీలు, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నివారణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయడం తప్పనిసరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.