News April 3, 2025

PDPL: విద్యాశాఖ కార్యదర్శితో వీసీలో పాల్గొన్న కలెక్టర్

image

ఆన్‌లైన్ ద్వారా మధ్యాహ్న భోజన చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అన్నారు. మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపుపై జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్టు తెలిపారు. 

Similar News

News April 11, 2025

BREAKING: తహవూర్ రాణాకు 18రోజుల రిమాండ్

image

ముంబై బాంబు దాడుల కీలక సూత్రధారి, నరహంతకుడు తహవూర్ రాణాను NIA ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అతడిని విచారించేందుకు రిమాండ్‌కు అప్పగించాలన్న సంస్థ విజ్ఞప్తిని న్యాయస్థానం మన్నించింది. రాణాకు 18రోజుల రిమాండ్‌ను విధిస్తున్నట్లు తెలిపింది.

News April 11, 2025

అపార్ట్ కార్డుల నమోదులో మొదటి స్థానంలో జగిత్యాల

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే అపార్ కార్డుల నమోదులో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 1096 పాఠశాలలు ఉండగా.. 1,61,822 మంది విద్యార్థులు ఉన్నారు. అపార్ కార్డుల నమోదులో 88.73 శాతం చేసి రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిచేందుకు కృషిచేసిన జిల్లా విద్యాధికారి రామును ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు ప్రత్యేకంగా అభినందించారు.

News April 11, 2025

జనగామ జిల్లాకు చేరుకున్న ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు

image

రాబోయే విద్యా సంవత్సరం 2025-26కు గాను జనగామ జిల్లాకు రావాల్సిన పాఠ్యపుస్తకాలు గురువారం నుంచి చేరుకుంటున్నాయని జిల్లా విద్యా శాఖ అధికారి రమేశ్ తెలిపారు. 2,78,310 పాఠ్యపుస్తకాలు అవసరం ఉంటాయని, రాష్ట్ర గోదాం నుంచి గురువారం జిల్లా కేంద్రానికి చేరాయని అన్నారు. ఈనెల చివరి వరకు అన్ని చేరుకుంటాయని, అవి రాగానే మండలాల వారీగా పంపుతామని తెలిపారు.

error: Content is protected !!