News August 16, 2025
PDPL: చిల్లపల్లి జీపీకి జాతీయ గుర్తింపు

మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో 2024 నేషనల్ పంచాయతీ అవార్డు అందుకున్న మంథని(M) చిల్లపల్లి(GP)కి మరో గౌరవం దక్కింది. కార్యదర్శి R.రామ్ కిశోర్కు స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఎర్రకోటకు కేంద్రప్రభుత్వం ఆహ్వానం పంపింది. నిన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కిశోర్ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. జెండా ఆవిష్కరణ ప్రత్యక్ష వీక్షణ గర్వకారణమని, గ్రామ అభివృద్ధికి కృషి కొనసాగిస్తానని ఆయన అన్నారు.
Similar News
News August 17, 2025
NFBS అమలులో జనగామ రెండో స్థానం: కలెక్టర్

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) అమలులో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కుటుంబ పెద్ద మరణించినా, పేదరిక రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతుందని, ఇప్పటి వరకు 880 మంది లబ్ధిదారులకు రూ.1.76 కోట్లు జమయ్యాయని తెలిపారు. కాగా ఈ పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన అవసరమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని కోరారు.
News August 17, 2025
రాజధానిలో మూడు రిజర్వాయర్ల నిర్మాణం.. వరదకు అడ్డుకట్ట!

భారీ వర్షాలకు రాజధాని ప్రాంతం జలమయం కావడం ప్రధాన సమస్యగా మారింది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం నీరుకొండ (0.4 టీఎంసీ), కృష్ణాయపాలెం (0.1 టీఎంసీ), శాఖమూరు (0.01 టీఎంసీ)లతో మూడు రిజర్వాయర్లను రూ. 1200-1500 కోట్లతో నిర్మిస్తున్నారు. 8 కి.మీ. గ్రావిటీ కెనాల్తో పాటు 48.3 కి.మీ. కాలువల వెడల్పు, పూడికతీత పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు పూర్తయితే అమరావతిలో నీరు నిలబడదని అధికారులు చెబుతున్నారు.
News August 17, 2025
జనగామ: ప్రకృతి గీసిన చిత్రం, క్యాప్చర్ చేసిన గౌడన్న

భూమిపై రైతుల కష్టంతో ఏర్పడిన పచ్చని పొలాలు, వాటిపై తాటి చెట్టు నీడ, ఇది ప్రకృతి గీసిన అందమైన చిత్రం. ఈ చిత్రం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం మీదికొండలో కనిపించింది. ఎర్రని సూర్యుడుని అడ్డుకున్న తాటి చెట్టు నీడ, పచ్చని పొలాలపై పడి ఆకర్షించింది. కాగా, ఆ చెట్టుపై ఉన్న గౌడన్న శివకుమార్ చిత్రీకరించిన ఈ ఫొటోను Way2News సేకరించింది.