News October 24, 2025

PDPL: జిల్లా పంచాయతీ అధికారి సమీక్షా సమావేశం

image

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా పంచాయతీ అధికారి అధ్యక్షతన బిల్ కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. పన్నుల వసూళ్లు, శుభ్రత, ప్రజా సేవలు, హౌసింగ్ పథకాలు వంటి అంశాలపై చర్చించారు. గ్రామాల్లో శుభ్రత, వందశాతం పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. నిర్లక్ష్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News October 24, 2025

ప్రకాశం: విద్యుత్ సమస్య తలెత్తితే కాల్ చేయండి.!

image

ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ లైన్లు తెగిపడితే తప్పక విద్యుత్ శాఖ ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. ఒంగోలులోని విద్యుత్ భవన్‌లో ఆయన మాట్లాడారు. తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు విరిగినా కంట్రోల్ రూమ్ నంబర్ 9440817491కు సమాచారం అందించాలని ఆయన కోరారు.

News October 24, 2025

పెనుగొండ: గంజాయి కలిగి ఉన్న యువకులు అరెస్ట్

image

పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి బ్రిడ్జ్ వద్ద గంజాయితో ఉన్న ఐదుగురు యువకులను పెనుగొండ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 5.630 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పెనుగొండకు చెందిన సాయి నాగేంద్ర, దుర్గాసాయి, చందు, దానేశ్వరరావు, సిద్ధాంతానికి చెందిన సాయిరాంను అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై గంగాధర్ తెలిపారు.

News October 24, 2025

ఓయూ MBA పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్) రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.