News March 1, 2025
PDPL: టాస్క్ ద్వారా వివిధ కోర్సుల ద్వారా శిక్షణ జిల్లా కలెక్టర్

టాస్క్ ద్వారా వివిధ కోర్సుల శిక్షణకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతున్నాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ విద్యార్థులకు ఇటీవల రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రారంభించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రం టాస్క్ ద్వారా వివిధ కోర్సులకు సంబంధించి శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నామన్నారు. పూర్తి వివరాలకు పెద్దపల్లి ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలోని టాస్క్ ఆఫీసులో సంప్రదించాలన్నారు.
Similar News
News March 1, 2025
మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్

TG: మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని ఆ కులం నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు నివాసంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్, BJP, BRSకు చెందిన కాపు నేతలు పాల్గొన్నారు. కులగణనలో కాపుల సంఖ్యను తగ్గించారని, ప్రభుత్వ/నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్నూరు కాపు సభ, మంత్రి పదవి ఇస్తేనే కులగణనపై కృతజ్ఞత సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
News March 1, 2025
ఫిబ్రవరి GST కలెక్షన్స్ @ రూ.1.84లక్షల కోట్లు

ఫిబ్రవరిలో స్థూల GST వసూళ్లు 9.1% పెరిగి రూ.1.84లక్షల కోట్లుగా ఉన్నాయి. స్థానిక రాబడి 10.2% ఎగిసి రూ.1.42లక్షల కోట్లు, దిగుమతులపై రాబడి 5.4% ఎగిసి రూ.41,702కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో CGST రూ.35,204 కోట్లు, SGST రూ.43,704 కోట్లు, IGST రూ.90,870 కోట్లు, సెస్ రూ.13,868 కోట్లు. ఇక రూ.20,889 కోట్లు రీఫండ్ చెల్లించగా నికర GST రూ.1.63లక్షల కోట్లుగా తేలింది. 2024 FEBలో ఇది రూ.1.50 లక్షల కోట్లే.
News March 1, 2025
నేనెవ్వరినీ బెదిరింపులకు గురిచేయట్లేదు: కిషన్ రెడ్డి

TG: కాంగ్రెస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ <<15611310>>తనపై ఎదురుదాడి<<>> చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తానెవ్వరినీ బెదిరింపులకు గురి చేయట్లేదని స్పష్టం చేశారు. రేవంత్ మాటల్లో పార్టీ నేతల్లోని అసంతృప్తి, అంతర్గత కుమ్ములాటలు కనిపిస్తున్నాయని చెప్పారు. మోదీ హయాంలో రూ.10 లక్షల కోట్ల విలువైన పనులు రాష్ట్రంలో చేపట్టినట్లు పేర్కొన్నారు.