News December 25, 2025
PDPL: పేద మహిళకు సర్కారు దవాఖానలో శస్త్రచికిత్స

అండాశయ గడ్డలతో బాధపడుతున్న ఓ నిరుపేద మహిళకు పెద్దపల్లి ACP కృష్ణ చొరవతో పునర్జన్మ లభించింది. బ్రాహ్మణపల్లికి చెందిన 40 ఏళ్ల మహిళ అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండగా, ACP స్పందించి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్తో మాట్లాడారు. వెంటనే బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి గడ్డలను తొలగించారు. ఏసీపీ, డాక్టర్లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.
Similar News
News December 26, 2025
చీరాల: మద్యం మత్తులో ASI రచ్చ.. SP ఆగ్రహం

చీరాలలో మద్యం మత్తులో హల్చల్ సృష్టించిన వేటపాలెం ASI రవికుమార్పై తక్షణమే చర్యలు తీసుకుని వీఆర్కు పంపించినట్లు SP ఉమామహేశ్వర్ తెలిపారు. మద్యం మత్తులో పోలీసుల మధ్య జరిగిన ఘర్షణపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బంది క్రమశిక్షణకు మారుపేరని ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు. ఇటువంటి ఘటనలకు పాల్పడితే సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 26, 2025
పార్వతీపురం:104 మొబైల్ మెడికల్ యూనిట్లలో ఉద్యోగాలు

రాష్ట్రవ్యాప్తంగా 104 MMUలలో ఖాళీగా ఉన్న డ్రైవర్, DEO పోస్టులు భర్తీ చేస్తున్నట్లు పార్వతీపురం జిల్లా 104 మేనేజర్ S.కృష్ణ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అవసరమైన ధ్రవపత్రాలతో డిసెంబరు 27,28 తేదీలలో విజయవాడ మార్కెట్ యార్డ్, గొల్లపూడి DLO office వద్ద హాజరుకావాలని పేర్కొన్నారు.
News December 26, 2025
ఫ్లాట్గా మొదలైన స్టాక్ మార్కెట్లు..

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్గా మొదలయ్యాయి. నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 26,130 వద్ద, సెన్సెక్స్ 50 పాయింట్లు కోల్పోయి 85,350 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్లో భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్, ఎన్టీపీసీ, ట్రెంట్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ఉండగా, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, సన్ ఫార్మా, టీసీఎస్, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.


