News August 15, 2024
PDPL: 140 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేత

పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్రం దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 140 మందికి ఉద్యోగులకు ప్రశంస పత్రాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష, MLA విజయరమణారావుతో కలిసి అందజేశారు.
Similar News
News November 9, 2025
KNR: ట్రాఫిక్ చలాన్ పేరుతో సైబర్ మోసం

KNR జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ట్రాఫిక్ చలాన్ పేరుతో ఫేక్ వాట్సాప్ మెసేజ్ పంపి, APK యాప్ డౌన్లోడ్ చేయించడంతో చెర్లబుత్కూర్ గ్రామానికి చెందిన మధుకర్ ఖాతా నుంచి రూ.70,000లు, ఇతర బాధితుల నుంచి మరో రూ.1.20 లక్షల వరకు సొమ్ము మాయమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద లింకులు, యాప్లను క్లిక్ చేయవద్దని పోలీసులు సూచించారు.
News November 8, 2025
కరీంనగర్ జిల్లా ప్రగతిపై గవర్నర్ సమీక్ష

కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి పవర్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా సమగ్ర స్వరూపాన్ని, కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరును గవర్నర్కు వివరించారు. పథకాలు సమర్థవంతంగా అమలు అవుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 8, 2025
KNR: విద్యార్థులకు రాజ్యాంగ హక్కులపై అవగాహన

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా KNR జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును శుక్రవారం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి కె. వెంకటేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, వారి భద్రత కోసం రూపొందించిన చట్టాల గురించి సవివరంగా వివరించారు.


