News October 13, 2025
PDPL: 6 నెలల్లో పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

పెద్దపల్లి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మాణం జరుగుతున్న జడ్పీ కాంప్లెక్స్ పనులను కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఆరు నెలల్లో నాణ్యతతో పనులు పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులపై ఇంజినీరింగ్ అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఈ సందర్బంగా ZP సీఈఓ నరేందర్, EE గిరీష్ బాబు, తహశీల్దార్ రాజయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 13, 2025
అనకాపల్లి జిల్లాలో 1.30 లక్షల గుంబూషియా చేపలు విడుదల

గుంబూషియా చేపలతో దోమలను నియంత్రించవచ్చునని డీఆర్ఓ సత్యనారాయణరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో గల కొలనులో గుంబూషియా చేపలను విడుదల చేశారు. జిల్లాలో ఎంపిక చేసిన 295 నీటి నిల్వ కేంద్రాలు, చెరువులు,కొలనులు బావుల్లో 1.30 లక్షల గుంబూషియా చేపలను విడుదల చేసినట్లు తెలిపారు. యాంటీ లార్వా ఆపరేషన్ లో ఈ చేపలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇవి నీటిలో లార్వాను పూర్తిగా తినేస్తాయన్నారు.
News October 13, 2025
జీవీఎంసీలో పీజీఆర్ఎస్కు 100 వినతులు

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 100 వినతులు వచ్చాయి. ఈ వినతులను జీవీఎంసీ అదనపు కమిషనరు డి.వి.రమణమూర్తి తీసుకున్నారు. ఇందులో అడ్మినిస్ట్రేషన్ విభాగమునకు 4, రెవెన్యూ 5, ప్రజారోగ్యం 6, పట్టణ ప్రణాళిక 58, ఇంజినీరింగు 22, మొక్కల విభాగం 1, యుసిడి 04 కలిపి మొత్తంగా 100 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News October 13, 2025
భీమవరం: నేటి పీజీఆర్ఎస్కు 95 అర్జీలు

భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 95 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.