News January 8, 2026
PDPL: ‘RBSK సిబ్బంది సమయపాలన పాటించాలి’

DMHO డాక్టర్ ప్రమోద్ కుమార్ గురువారం RBSK డాక్టర్లు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. RBSK డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తామని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి, రిఫరల్ కేసులు పెంచాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలని తెలిపారు. డా. శ్రీరాములు, డా. కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
Similar News
News February 18, 2026
నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. లోకేశ్ సెటైర్

AP: కొలంబోలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు భారీగా ప్రజాధనం ఖర్చు చేశారనే ప్రచారంపై మంత్రి లోకేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ‘ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా జగన్?’ అంటూ పుష్ప స్టైల్లో సెటైర్ వేశారు. కాగా లోకేశ్ పర్యటన కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఇప్పటికే ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.
News February 18, 2026
జైత్రయాత్రతో చరిత్రలో నిలిచిన జిల్లా జగిత్యాల

ఉద్యమం అనగానే గుర్తుకొచ్చే జిల్లా జగిత్యాల. జగిత్యాల జైత్రయాత్రతో చరిత్రలో నిలిచిన ఈ జిల్లా 2016లో ఉమ్మడి కరీంనగర్ నుంచి విడిపోయి స్వతంత్రంగా ఏర్పడింది. 17వ శతాబ్దంలో జగదేవుడు పాలించిన నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని ఆయన పేరుతో జగిత్యాలగా పిలుస్తారు. వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల.. శాతవాహనుల తొలి రాజధానిగా ప్రసిద్ధి. జిల్లాలో వ్యవసాయం ప్రధాన వృత్తి కాగా, మొక్కజొన్న, వరి పంటలు ఎక్కువగా సాగు అవుతున్నాయి.
News February 18, 2026
మ్యూల్ అకౌంట్స్ పై విచారణ.. యువకుడి సూసైడ్!

విజయవాడలో పెద్దఎత్తున మ్యూల్ అకౌంట్స్ తెరిచి సైబర్ నేరలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో పోలీసులు పలు బ్యాంకుల్లో పని చేసే మేనేజర్లు, ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విచారిస్తున్నారు. ఈ క్రమంలో NTR సర్కిల్లోని ఇండియన్ బ్యాంకులో ఒప్పంద ఉద్యోగి ఆవుల సాయి భవాని(32)ని గత వారం విచారించారు. మనస్తాపం చెందిన యువకుడు ఈ నెల 16న తాడేపల్లి పరిధిలో బకింగ్హామ్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.


