News February 5, 2025

PDPL: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. రేపటి నుంచి ట్రైనింగ్

image

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రేవంత్ సర్కార్ మరో ముందడుగు వేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు బుధవారం నుంచి హైదరాబాద్లో శిక్షణ మొదలుపెట్టనుంది. వీరి శిక్షణ పూర్తి అయ్యాక టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వసున్నారు. ఈ నెల 15లోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తోందని సమాచారం. ఈ నెల చివరి వారం లేదా మార్చి మొదటివారంలో ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 5, 2025

చర్చనీయాంశంగా మారిన దేవినేని ఉమ ట్వీట్

image

ట్విటర్, వేదికగా రేషన్ మాఫియాపై మాజీమంత్రి దేవినేని ఉమ సంచల ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, విజయవాడ సిటీ పోలీస్, ఎన్టీఆర్ కలెక్టర్‌ని ట్యాగ్ చేశారు. వైసీపీ హయాంలో దోపిడీ చాలదన్నట్లు ఇంకా మైలవరంలో రేషన్ దోపిడీ అంటూ పోస్ట్ చేశారు. మాఫియా ఆట కట్టిస్తామని అన్నారు. 2 రోజుల క్రితం ఓ వాహనంలో పోలీసుల తనిఖీలో మైలవరంలో పట్టుబడిన 22 క్వింటాళ్ల రేషన్ బియ్యం వేదికగా రాజకీయం ముదురుతోంది. 

News February 5, 2025

నాటు-నాటు ఫోజులో ‘NTR’ పోస్టర్ షేర్ చేసిన ‘ఫిఫా వరల్డ్ కప్’

image

ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్లు నేమార్, టెవెజ్, రొనాల్డో బర్త్ డే కావడంతో ‘ఫిఫా వరల్డ్’ కప్ ఇంట్రెస్టింగ్‌గా విష్ చేసింది. ఈ ముగ్గురూ ‘RRR’ సినిమాలోని నాటునాటు స్టెప్‌ వేసినట్లు పోస్టర్‌పై NTR అని ఉంచి ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, RRR టీమ్ సైతం స్పందిస్తూ వారికి విషెస్ తెలియజేశారు.

News February 5, 2025

రక్షణ మంత్రితో ముగిసిన లోకేశ్ భేటీ.. వాటికోసం విజ్ఞప్తి

image

AP: ఢిల్లీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మంత్రి లోకేశ్ భేటీ ముగిసింది. రాష్ట్రంలో NDA సర్కారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనకు వివరించిన లోకేశ్, రక్షణ రంగానికి సంబంధించిన పలు పెట్టుబడుల్ని APలో పెట్టాలని కోరారు. డిఫెన్స్ క్లస్టర్, రక్షణ రంగ పరికరాల తయారీలో కొన్ని యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాకు తమ వంతు సహకారం అందిస్తామని ఆయనకు రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు.

error: Content is protected !!