News September 12, 2024

PDSU 50ఏళ్ల స్వర్ణోత్సవ సభ లోగో, పోస్టర్ ఆవిష్కరణ

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈనెల 24న నిర్వహించే PDSU 50ఏళ్ల లోగో, స్వర్ణోత్సవ సభ పోస్టర్ ను PDSU మాజీ నేతలు బి.రాము, కాలేశ్వర్ ఆవిష్కరించారు. 1974లో PDSU ఏర్పడిన నాటి నుంచి 2024 వరకు మొక్కవోని దీక్షతో, విద్యారంగ సమస్యల పరిష్కారానికై తన వంతు కృషి చేసిందని వారు తెలిపారు. ఈ సమావేశంలో కాలేశ్వర్, దేవేందర్, అరుణ్, అంబదాస్, సాంబశివుడు, సాయి, మారుతి, సీతారాం, అజయ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 11, 2025

MBNR: మూడా సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మూడా కార్యాలయంలో మూడా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, పర్ణిక రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముడా అధికారులపై పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

News March 10, 2025

MBNR: చెక్‌డ్యామ్‌లో పడి గొర్రెల కాపరి మృతి

image

చిన్నచింతకుంట మండలంలో చెక్‌డ్యామ్‌లో పడి గొర్రెల కాపరి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కౌకుంట్ల మం. అప్పంపల్లికి చెందిన మహేశ్(25) తనకున్న గొర్రెలను స్నానం చేయించేందుకు అప్పంపల్లి-ఏదులాపురం మధ్యలో ఉన్న వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం సమీపంలోని నీటి గుంతకు తీసుకొచ్చాడు. గొర్రెలకు స్నానం చేయిస్తుండగా కాలుజారి గుంతలో పడి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

News March 10, 2025

MBNR: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

రాజాపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. జడ్చర్లకు చెందిన ఓరుగంటి సత్యనారాయణశర్మ(71) తన స్కూటీపై ముదిరెడ్డిపల్లిలో ఓ ఇంట్లో పూజ చేయించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోకి వెళ్లేందుకు టర్న్ తీసుకుంటుండగా ఓ బైక్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

error: Content is protected !!