News August 29, 2025

తెలుగు మాట్లాడితే మనశ్శాంతి!

image

తెలుగు భాష గొప్పతనం గురించి ఇప్పటి పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు పదాలు పలకడం వల్ల మన ఆరోగ్యమూ మెరుగవుతుంది. ఇది శరీరంలోని 72వేల నాడులను యాక్టివ్ చేసి మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. దేశంలో నాలుగో, ప్రపంచంలో 16వ అతిపెద్ద భాష కూడా తెలుగే. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామాల మధ్య ఉన్న భాగాన్ని ‘త్రిలింగ దేశం’ అనేవారు. ఈ ‘త్రిలింగ’ పదం నుంచే తెలుగు పదం వచ్చింది. share it

Similar News

News February 1, 2026

NRIలకు గుడ్‌న్యూస్.. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు బూస్ట్!

image

బడ్జెట్‌లో NRIs కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ (PIS) పరిమితులను ప్రభుత్వం భారీగా పెంచింది. వ్యక్తిగత పెట్టుబడి లిమిట్‌ను 5% నుంచి 10%కి, అలాగే NRIల మొత్తం పెట్టుబడి పరిమితిని 10% నుంచి 24%కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల భారతీయ కంపెనీల్లో NRIలు మరింత మెరుగైన వాటా పొందే అవకాశం ఉంటుంది.

News February 1, 2026

కర్రపెండలంలో బోరాన్ లోపం, నివారణ

image

కర్రపెండలంలో బోరాన్ లోపం వల్ల మొక్కల కణుపుల మధ్య దూరం తగ్గి, మొక్కల పెరుగుదల అంతగా ఉండదు. లేత ఆకులు కుచించుకుపోతాయి. గోధుమ రంగులో జిగురు పదార్ధం ఆకుల కాడలు, కాండం మొవ్వభాగంలో కనిపిస్తుంది. వేరు వ్యవస్థ పెరుగుదల దెబ్బతిని, మొవ్వభాగం ఎండి, దుంపలపై పగుళ్లు వస్తాయి. ఈ లోప నివారణకు ఎకరాకు 4KGల బోరాక్స్ భూమిలో వేసి కప్పాలి. ముచ్చెలను 1% బోరాక్స్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తర్వాత నాటాలి.

News February 1, 2026

పోలవరానికి తగ్గిన నిధుల కేటాయింపు

image

AP: FY26-27 కేంద్ర బ‌డ్జెట్‌లో పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేటాయింపులు తగ్గిపోయాయి. ఈసారి ఈ ప్రాజెక్టుకు ₹3320 కోట్లు మాత్రమే కేటాయించారు. గ‌త ఏడాది బ‌డ్జెట్‌లో ₹5936 కోట్లు ఇచ్చారు. అయితే గత ఏడాది ఎక్కువ నిధులు కేటాయించినా రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ₹3017 కోట్లు మాత్రమే వచ్చాయి. పోల‌వ‌రం వాట‌ర్ స్టోరేజి లెవ‌ల్‌ను 41.15 మీట‌ర్ల‌కు కుదించిన‌ట్లు కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.