News March 18, 2025
పెద్ద దేవళాపురం@42.7 డిగ్రీలు

AP: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉలిందకొండలో 42.6, ఖాజీపేటలో 41.8, దరిమడుగులో 41.5, నాగసముద్రం, వత్తలూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే నమోదవడం గమనార్హం. అలాగే 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 42 మండలాల్లో వడగాలులు వీచాయని APSDMA వెల్లడించింది.
Similar News
News March 19, 2025
TODAY HEADLINES

TG: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
TG: ఇందిరమ్మ ఇళ్లు.. వారికి తొలి ప్రాధాన్యత: సీఎం రేవంత్
AP: చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ.50,000: CM
AP: 50 ఏళ్లకే పెన్షన్పై మంత్రి కీలక ప్రకటన
☛ కుంభమేళా దేశ ప్రజల విజయం: PM మోదీ
☛ మే 20న దేశవ్యాప్త సమ్మె: కార్మిక సంఘాలు
☛ ISS నుంచి భూమిపైకి సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం
News March 19, 2025
నెల రోజులపాటు గ్రామ గ్రామాన సంబరాలు: టీపీసీసీ చీఫ్

TG: BC కులగణన, SC వర్గీకరణపై రాష్ట్రమంతటా పెద్దఎత్తున ప్రచారం చేయాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. ‘అసెంబ్లీలో BC కులగణన, SC వర్గీకరణ బిల్లులను ఆమోదించుకున్నాం. ఇవి చరిత్రలోనే నిలిచిపోయే ఘట్టాలు. వీటి ప్రాముఖ్యత ప్రజలకు తెలిసేలా గ్రామాల్లో నెల రోజులపాటు సంబరాలు నిర్వహించాలి. జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాలను కూడా నిర్వహించాలి’ అని తెలిపారు.
News March 19, 2025
నిద్రపోయే ముందు నీరు తాగుతున్నారా?

రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీరు తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం బాగా జీర్ణం అవడంతో పాటు కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తదితర సమస్యలు తొలగిపోతాయి. పొట్ట తేలికగా మారిన భావన కలుగుతుంది. వీటితో పాటు నాడీ వ్యవస్థ రిలాక్స్ అయి ఒత్తిడి తగ్గుతుంది. యాంగ్జైటీ వంటి సమస్యలు దూరమై హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి గోరువెచ్చని నీరు చక్కటి పరిష్కారం.