News March 18, 2025
పెద్ద దేవళాపురం@42.7 డిగ్రీలు

AP: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉలిందకొండలో 42.6, ఖాజీపేటలో 41.8, దరిమడుగులో 41.5, నాగసముద్రం, వత్తలూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే నమోదవడం గమనార్హం. అలాగే 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 42 మండలాల్లో వడగాలులు వీచాయని APSDMA వెల్లడించింది.
Similar News
News November 19, 2025
హోటళ్ల యజమానుల ఇళ్లపై రైడ్స్.. భారీగా నగదు పట్టివేత

హైదరాబాద్లోని ప్రముఖ బిర్యానీ హోటళ్లు పిస్తా హౌస్, షా గౌస్ యజమానుల ఇళ్లలో జరిపిన ఐటీ <<18317664>>సోదాల్లో<<>> భారీగా నగదు, బంగారం పట్టుబడ్డాయి. 2 రోజులుగా సోదాలు నిర్వహించిన అధికారులు రూ.20 కోట్ల నగదుతో పాటు పెద్ద మొత్తంలో గోల్డ్, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. ఐటీ చెల్లింపులో అవకతవకల నేపథ్యంలో రైడ్స్ జరిగినట్లు సమాచారం.
News November 19, 2025
హోటళ్ల యజమానుల ఇళ్లపై రైడ్స్.. భారీగా నగదు పట్టివేత

హైదరాబాద్లోని ప్రముఖ బిర్యానీ హోటళ్లు పిస్తా హౌస్, షా గౌస్ యజమానుల ఇళ్లలో జరిపిన ఐటీ <<18317664>>సోదాల్లో<<>> భారీగా నగదు, బంగారం పట్టుబడ్డాయి. 2 రోజులుగా సోదాలు నిర్వహించిన అధికారులు రూ.20 కోట్ల నగదుతో పాటు పెద్ద మొత్తంలో గోల్డ్, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. ఐటీ చెల్లింపులో అవకతవకల నేపథ్యంలో రైడ్స్ జరిగినట్లు సమాచారం.
News November 19, 2025
స్టీల్ ప్లాంటుపై ప్రశ్నిస్తే అసహనం ఎందుకు: బొత్స

AP: విశాఖ స్టీల్ ప్లాంటుపై ప్రశ్నిస్తే చంద్రబాబు <<18299181>>సహనం<<>> కోల్పోతున్నారని YCP నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. బాధ్యత గల CM స్పందించాల్సిన విధానమిదేనా అని నిలదీశారు. డొంకతిరుగుడు సమాధానాలు మాని ప్రైవేటుపరం కానివ్వమని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. CM వైఖరిపై అనుమానాలున్నాయన్నారు. అటు ప్రభుత్వ పెద్దలు, పోలీసు వ్యవస్థ తెచ్చిన ఒత్తిడితోనే పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీశ్ చనిపోయి ఉంటాడని ఆరోపించారు.


