News September 6, 2024
వరద బాధితులకు పెమ్మసాని రూ.కోటి విరాళం
AP: వరద బాధితులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.కోటి సాయం ప్రకటించారు. అలాగే ఎస్బీఐ అమరావతి సర్కిల్ రూ.5.87 కోట్లు, దేవీ సీ ఫుడ్స్ రూ.కోటి, కృష్ణా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు రూ.50 లక్షల సాయం అందించారు.
Similar News
News February 4, 2025
అన్ని ఆఫీసుల్లో మరాఠీ తప్పనిసరి.. లేదంటే చర్యలు
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని GOVT కార్యాలయాల్లో ఉద్యోగులంతా తప్పనిసరిగా మరాఠీలోనే మాట్లాడాలని ఆదేశాలు జారీ చేసింది. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరాఠీ భాష పరిరక్షణ, అభివృద్ధి కోసం ప్రజా వ్యవహారాల్లో ఈ భాషను ఉపయోగించాలని ప్రభుత్వ కమిటీ సిఫారసు చేసింది. కంప్యూటర్ కీ బోర్డుల్లోనూ మరాఠీ దేవనాగరి లిపి ఉండాలని పేర్కొంది. ఆ మేరకు GOVT చర్యలు ప్రారంభించింది.
News February 4, 2025
8th, ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తులు
AP: గురుకుల విద్యాలయాలలో 2025-26కుగాను ఎనిమిదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 7th, టెన్త్ ఉత్తీర్ణులైన వారు మార్చి 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష లోపు ఉండాలి. మార్చి 4న హాల్టికెట్లు విడుదలవుతాయి. 9న పరీక్ష ఉంటుంది. 25న మెరిట్ జాబితా ప్రకటిస్తారు. ఏప్రిల్ 11, 21 తేదీల్లో రెండు దశల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం <
News February 4, 2025
కులగణన: నేడు క్యాబినెట్, అసెంబ్లీ సమావేశం
TG: సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ ఉ.10 గంటలకు సమావేశం కానుంది. కుల గణన సర్వే నివేదికకు ఆమోదం తెలపనుంది. ఉ.11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై సర్వేపై చర్చించనుంది. కులగణన తప్పుల తడక అంటూ బీసీ సంఘాలు, విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో సభ వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. కాగా ఈ నెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.