News August 30, 2024

పెండింగ్ కేసులు: హైకోర్టుల్లో 59 లక్షలు, ట్రయల్ కోర్టుల్లో 4.5 కోట్లు

image

దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో పెండింగ్ కేసులు గతంలో ఎన్నడూ చూడని స్థాయికి పెరిగాయి. 2014లో 41 లక్షలుగా ఉన్న ఇవి 2023లో ఏకంగా 61 లక్షలకు చేరాయి. అయితే ఈ ఏడాది కాస్త తగ్గి 59 లక్షలకు దిగొచ్చాయి. గత దశాబ్ద కాలంలో కేసులు తగ్గింది ఈ ఒక్కసారే. ఇక ట్రయల్ కోర్టుల సంగతి చెప్పనలవి కాదు. 2014లో 2.6 కోట్లున్న పెండింగ్ కేసులు ఇప్పుడు 4.5 కోట్లకు ఎగబాకాయి. విచారించే కొద్దీ కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి.

Similar News

News February 9, 2026

రోహిత్, కోహ్లీకి BCCI షాక్

image

సెంట్రల్ కాంట్రాక్ట్(2025-26) విషయంలో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి BCCI షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు A+ కేటగిరీలో ఉన్న వారిద్దరినీ గ్రేడ్ Bలో చేర్చింది. రోకో టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అటు బుమ్రా, గిల్, జడేజాను మాత్రమే గ్రేడ్ Aలో ఉంచింది.

News February 9, 2026

ఒక్క నిమిషంలో పని ఒత్తిడి తగ్గించుకోండి!

image

ఆఫీస్‌లో వర్క్ లోడ్ వల్ల ఎంతోమంది ఒత్తిడికి లోనవుతుంటారు. దాంతో గుండె వేగం, BP పెరుగుతాయి. వాగస్ నాడిని యాక్టివేట్ చేయడంతో దానిని కంట్రోల్ చేయొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ‘ముక్కు ద్వారా లంగ్స్ నిండా గాలిపీల్చుకోండి. ఆపి మరో షార్ప్ బ్రీత్ తీసుకోండి. తర్వాత నోటిగుండా మెల్లగా మొత్తం గాలిని వదిలేయండి. ఇలా 4-5సార్లు చేస్తే ఒక్క నిమిషంలోపే మీ స్ట్రెస్ లెవల్స్ తగ్గిపోతాయి’ అని చెబుతున్నారు.

News February 9, 2026

‘SIR’కు అడ్డంకులు సృష్టించొద్దు.. సుప్రీంకోర్టు హెచ్చరిక

image

‘SIR’ ప్రక్రియను వ్యతిరేకిస్తూ WB ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై SC కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సర్‌’ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించొద్దని హెచ్చరించింది. మరోవైపు 300 మంది అధికారులను కోరితే ప్రభుత్వం 80 మందిని మాత్రమే ఇచ్చిందని EC కోర్టుకు తెలిపింది. స్థానికతను నిరూపించుకోవడానికి ఓటర్లకు ఈసీ ఒక్క అవకాశమూ ఇవ్వలేదని ప్రభుత్వం వాదించింది. దీంతో గడువును వారం రోజులపాటు పొడిగిస్తున్నట్లు SC తెలిపింది.