News August 30, 2024

పెండింగ్ కేసులు: హైకోర్టుల్లో 59 లక్షలు, ట్రయల్ కోర్టుల్లో 4.5 కోట్లు

image

దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో పెండింగ్ కేసులు గతంలో ఎన్నడూ చూడని స్థాయికి పెరిగాయి. 2014లో 41 లక్షలుగా ఉన్న ఇవి 2023లో ఏకంగా 61 లక్షలకు చేరాయి. అయితే ఈ ఏడాది కాస్త తగ్గి 59 లక్షలకు దిగొచ్చాయి. గత దశాబ్ద కాలంలో కేసులు తగ్గింది ఈ ఒక్కసారే. ఇక ట్రయల్ కోర్టుల సంగతి చెప్పనలవి కాదు. 2014లో 2.6 కోట్లున్న పెండింగ్ కేసులు ఇప్పుడు 4.5 కోట్లకు ఎగబాకాయి. విచారించే కొద్దీ కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి.

Similar News

News February 8, 2026

2030లో కూలిపోనున్న ISS!

image

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని NASA చెబుతోంది. 1998లో స్పేస్‌లోకి అడుగు పెట్టిన ISSని 2030లో పసిఫిక్ మహా సముద్రంలో కూల్చేయనున్నారు. ఈ బాధ్యతను ‘Space X’కు అప్పగించింది. భూభాగానికి వేల KM దూరంలోని ‘పాయింట్ నీమో’లో కూలుస్తారు. ఇయర్లీ మెయింటినెన్స్ పెరగడం, అనుకున్న దానికంటే ఎక్కువ కాలమే స్పేస్‌లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News February 8, 2026

ఐర్లాండ్ టార్గెట్ ఎంతంటే?

image

T20WC: ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తడబడి నిలబడింది. తొలుత బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచినా మెండిస్ ద్వయం అదరగొట్టింది. 20 ఓవర్లలో 163/6 రన్స్ చేసింది. కుశాల్ మెండిస్(56), కమిందు మెండిస్(44), నిస్సంక(24) మాత్రమే రాణించారు. IRE బౌలర్లు జార్జ్, మెక్కార్తీ చెరో 2, మార్క్ అడైర్, డెలానీలు చెరో వికెట్ తీశారు. ఐర్లాండ్ 20 ఓవర్లలో 164 రన్స్ చేయాలి.

News February 8, 2026

రూ.100 కోట్లతో BJPని ఓడించాలనుకుంటున్నారు: బండి

image

TG: MIMతో BRS, కాంగ్రెస్ లాలూచీ పడ్డాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘కరీంనగర్ రావడానికి రేవంత్ భయపడి ఒవైసీని పంపారు. ఇక్కడ ఎన్నికలు ఇండియా-పాక్ మ్యాచ్‌లా ఉంటాయి. MIM, కాంగ్రెస్ రహస్య మీటింగ్ పెట్టుకున్నాయి. రూ.100కోట్లు ఖర్చు పెట్టి BJPని ఓడించాలనుకుంటున్నారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే. ఇక్కడ MIM గెలిస్తే ప్రజలను ఎవరూ కాపాడలేరు’ అని కరీంనగర్‌ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.