News March 21, 2025
నేడే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదల

AP: CM చంద్రబాబు ఆదేశాల మేరకు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల కానున్నాయి. CPS, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద కలిపి రూ.6,200 కోట్లు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని CM అన్నారు. బకాయిల విడుదలపై ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన పెండింగ్ అంశాలపైనా సానుకూలంగా స్పందించాలని ప్రకటనలో కోరింది.
Similar News
News November 27, 2025
బీసీ సంఘాలు BJP, BRSపై పోరాడాలి: పొన్నం

TG: బీసీ సంఘాల నాయకులు తమపై కాకుండా బీసీ బిల్లును ఆపుతున్న బీజేపీ, BRS నేతలపై పోరాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కావాలని కొంతమంది బీసీలకు తక్కువ సీట్లు వచ్చాయని తప్పుడు లెక్కలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో చట్టబద్ధంగా, న్యాయపరంగా తాము చేయాల్సిన అన్ని పనులు చేశామని తెలిపారు. బీజేపీ EWS రిజర్వేషన్లు తెచ్చింది కానీ బీసీ బిల్లును అడ్డుకుంటోందని విమర్శించారు.
News November 27, 2025
సెంట్రల్ అగ్రికల్చర్ వర్సిటీలో 179 పోస్టులు.. అప్లై చేశారా?

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (CAU)లో 179 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు DEC 6వరకు అప్లై చేసుకోవచ్చు. హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్ను DEC 15లోగా పోస్టు చేయాలి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD, PG, NET ఉత్తీర్ణతతో పాటు బోధన/ రీసెర్చ్లో అనుభవం ఉండాలి. నెలకు జీతం Prof.కు రూ.1,44,200, Assoc. Prof.కు రూ.1,31,400, asst.Prof. కు రూ.57,700 చెల్లిస్తారు. https://cau.ac.in
News November 27, 2025
వీటిని ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు!

మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో సర్దేస్తుంటారు చాలామంది. నిజానికి అన్నీ ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, గుమ్మడి, వెల్లుల్లి, సిట్రస్ ఫ్రూట్స్, ఆపిల్స్, పియర్స్, అప్రికాట్స్, మామిడి, టమాట వంటివీ గది ఉష్ణోగ్రత దగ్గరే నిల్వచేయొచ్చు. అవి పండిపోయి త్వరగా వాడలేనప్పుడే ఫ్రిజ్లో పెట్టాలి. పండ్ల పక్కనే ఆకుకూరల్ని పెడితే త్వరగా పాడైపోతాయి.


