News December 26, 2024
ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ?

AP: జనవరి 1న నూతన సంవత్సరం నేపథ్యంలో ఈ నెల 31వ తేదీనే పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ నేతలు చేసిన వినతికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయి. కాగా ఒకటో తేదీన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరంలో సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేస్తారని తెలుస్తోంది.
Similar News
News November 27, 2025
భారీగా పెరిగిన వెండి ధర.. తగ్గిన గోల్డ్ రేటు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్పై రూ.4,000 పెరిగి రూ.1,80,000కు చేరింది. కేవలం మూడు రోజుల్లోనే వెండి ధర రూ.9వేలు ఎగబాకింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.160 తగ్గి రూ.1,27,750కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పతనమై రూ.1,17,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి
News November 27, 2025
రొటీన్ మ్యానర్లో DNA టెస్టు కుదరదు: హైకోర్టు

దంపతుల మధ్య చట్టపరమైన వివాదాలు ఉన్నప్పుడు రొటీన్ మ్యానర్లో పిల్లలకు DNA టెస్టు కుదరదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. భార్యభర్తలు కలిసి ఉండే అవకాశం లేనప్పుడే ఈ పరీక్ష చేస్తారని చెప్పింది. ‘నా భార్య వారమే మా ఇంట్లో ఉంది. చదువులేని నాతో జీవించడానికి ఇష్టపడలేదు. 2011 మే నుంచి పుట్టింట్లోనే ఉండగా 2012 DECలో బిడ్డకు జన్మనిచ్చింది. అందువల్ల DNA టెస్టు చేయాలి’ అని భర్త కోరగా కోర్టు తోసిపుచ్చింది.
News November 27, 2025
హసీనా అప్పగింతపై పరిశీలిస్తున్నాం: భారత్

భారత్లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింతపై అక్కడి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు, శాంతి, ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంటుందన్నారు. తీవ్ర నేరాలు చేశారనే ఆరోపణలపై విచారణ జరిపిన ప్రత్యేక ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది.


