News May 1, 2024

ఇవాళ ఖాతాల్లోకి పెన్షన్

image

AP: రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆసరా పెన్షన్లను ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. బ్యాంకు ఖాతాలు ఉన్న 48.92 లక్షల మంది అకౌంట్లలో నేడు నగదు జమ కానుంది. బ్యాంకు అకౌంట్లు లేని వారు, దివ్యాంగులు, ఇతర సమస్యలు ఉన్నవారికి సచివాలయ ఉద్యోగులు ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఈసీ నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Similar News

News March 12, 2026

పిల్లల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్

image

13ఏళ్లలోపు పిల్లలకు యాడ్స్ లేకుండా కేవలం ఫోన్స్, మెసేజెస్‌కే యాక్సెస్ ఉండేలా పేరెంట్ లింక్డ్ అకౌంట్ ఫీచర్‌ను వాట్సాప్ లాంచ్ చేసింది. ఈ అకౌంట్ సెటప్ చేసేటప్పుడు QR కోడ్ స్కాన్ చేసి పిల్లల ఫోన్‌తో పేరెంట్స్ అకౌంట్ లింకప్ చేసుకోవాలి. వాళ్లు కాంటాక్ట్స్‌ను యాడ్/బ్లాక్/రిపోర్ట్ చేసినా పేరెంట్స్‌కు నోటిఫై అవుతుంది. 6 డిజిట్ పిన్‌తో పిల్లల అకౌంట్ సెట్టింగ్స్ మార్చే యాక్సెస్ పేరెంట్స్‌కు కల్పించింది.

News March 12, 2026

ఇరాన్ దాడిని ఖండించిన భారత్

image

గుజరాత్‌కు వస్తున్న థాయిలాండ్ కార్గో షిప్ ‘మయూరీ నారీ’పై ఇరాన్ దాడి చేయడాన్ని భారత్ ఖండించింది. వాణిజ్య నౌకలను టార్గెట్ చేయడాన్ని తప్పుపట్టింది. ఈ దాడులు ప్రారంభమైన తొలి దశలోనే భారతీయులు సహా ఎంతో మంది ప్రాణాలు పోయాయని.. వీటి తీవ్రత మరింత పెరిగేలా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా థాయ్ షిప్‌పై దాడి ఘటనలో 20 మందిని రక్షించగా.. మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది.

News March 12, 2026

గ్యాస్ కొరత.. రాష్ట్రంలోని హోటళ్ల కీలక నిర్ణయం

image

కమర్షియల్ గ్యాస్ కొరత, నిర్వహణ ఖర్చులపై AP హోటల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు విజయవాడలో అత్యవసరంగా సమావేశమైంది. గ్యాస్ ఇబ్బందుల దృష్ట్యా స్టార్‌ హోటళ్లలో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఆర్డర్లను త్వరలోనే నిలిపివేస్తామని పేర్కొంది. ప్రతి సోమవారం రెస్టారెంట్లు క్లోజ్ చేయాలని నిర్ణయించింది. కర్ణాటక తరహాలో కొన్ని హోటల్స్ కేవలం టీ, కాఫీలు మాత్రమే విక్రయించే పరిస్థితి రాబోతోందని తెలిపింది.